Begin typing your search above and press return to search.

ఓపిక పట్టండి విజయం సాధించబోతున్నాం!

By:  Tupaki Desk   |   10 April 2020 8:42 PM IST
ఓపిక పట్టండి విజయం సాధించబోతున్నాం!
X
ప్రపంచం మొత్తం మహమ్మారి కరోనాతో పోరాటం సాగిస్తున్న విషయం తెల్సిందే. కొదరు దీనికి ప్రపంచ యుద్దం కంటే ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు. పలు దేశాలు ప్రపంచ యుద్దం సమయంలో పోరాటం సాగించినట్లుగా సాగిస్తున్నాయి. ఈ సమయంలో జనాలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరికొందరు కనీసం తినడానికి తిండి కూడా లేక అల్లాడి పోతున్నారు. ఈ సమయంలో దాతృత్వంను కనబర్చేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.

సెలబ్రెటీలు ఈ సమయంలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఇంకా జీవితంపై నమ్మకం కలిగించేందుకు తమకు తోచిన మాటలు చెబుతూ వస్తున్నారు. సెలబ్రెటీలో ప్రతి రోజు డాక్టర్లకు పోలీసులకు శానిటైజేషన్‌ సిబ్బందికి సెల్యూట్‌ చెబుతూనే ఉన్నారు. తాజాగా రష్మిక మందన్న కూడా ఈ సమయంలో తన ఫాలోవర్స్‌ కు ధైర్యం చెప్పింది. కరోనా మహమ్మారితో మనం చేస్తున్న పోరాటం త్వరలోనే ముగుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.

కొన్ని రోజులు ఆగితే ఈ యుద్దంలో మనం గెలుపొందబోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో పేర్కొంది. కరోనాతో ప్రభుత్వాలు జనాలు చేస్తున్న పోరాటంను ఆమె యుద్దంతో పోల్చింది. పుట్టిన రోజు సందర్బంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందడంతో రష్మిక కృతజ్ఞతలు తెలియజేసింది.

ఇక ప్రస్తుతం ఈ అమ్మడు అల్లు అర్జున్‌ కు జోడీగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతోంది. అలాగే మరో రెండు తెలుగు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. మరో వైపు తమిళం ఇంకా మలయాళంలో కూడా ఈమె నటిస్తూనే ఉంది.