Begin typing your search above and press return to search.

టచ్ చేసి చూడు.. మర్చిపోయాడా?

By:  Tupaki Desk   |   7 Feb 2018 4:58 PM GMT
టచ్ చేసి చూడు.. మర్చిపోయాడా?
X
హిట్టు పడితే ప్రశాంతంగా ఉండటం కష్టమే. ఎదో ఒక సక్సెస్ మీటింగ్ లతో సినిమా వాళ్లు హంగామా చేస్తూ ఉంటారు. కానీ అదే డిజాస్టర్ పడితే.. బాధతో కూడిన ప్రశాంతత ఇక్కడ కనిపిస్తుంది. అయితే గత కొంత కాలంగా టాలీవుడ్ లో వరుస పరాజయాలను అందుకున్న మాస్ రాజా రవితేజ మాత్రం ఎప్పుడు ఒకేలా ఉన్నాడు. కాకపోతే రాజా ది గ్రేట్ లాంటి స్ట్రాంగ్ హిట్టు పడటంతో కొంచెం హంగామా గట్టిగానే చేశాడు.

ఇక ఆ సినిమా తరువాత వచ్చిన టచ్ చేసి చూడు మొదటి రోజుకే డిజాస్టర్ టాక్ ను అందుకుంది. దీంతో చిత్ర యూనిట్ చాలా వరకు కొంచెం నిరాశకు లోనైందనే టాక్ బాగా వస్తోంది. కానీ రవితేజ మాత్రం అలాంటి ఫీలింగ్ తో లేకుండా కనిపించాడు. ఎప్పటిలానే తన రెగ్యులర్ వర్క్ పై దృష్టి పెట్టాడు. ఇటీవల మొదలు పెట్టిన కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ ను రవితేజ ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వైజాగ్ సముద్ర తీరాన షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రవి తేజ టచ్ చేసి చూడు రిజల్ట్ ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాస్ రాజా పనితీరుపై కొందరు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు, ఇక కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ ని రామ్ తాళ్లూరి నిర్మిస్తుండగా మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.