Begin typing your search above and press return to search.

టాక్‌.. ఆఖరి దశకు చేరుకుంటున్న `ఆర్సీ 15`!?

By:  Tupaki Desk   |   28 Aug 2022 6:30 AM GMT
టాక్‌.. ఆఖరి దశకు చేరుకుంటున్న `ఆర్సీ 15`!?
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ కు ఇది 15వ ప్రాజెక్ట్ కావ‌డంతో.. `ఆర్సీ 15` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తోంది.

అలాగే అంజ‌లి, శ్రీ‌కాంత్‌, జ‌య‌రామ్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్షేష‌న్ త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు. ఇప్ప‌టికే యాబై శాతానికి పైగా షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రానికి కాస్త బ్రేక్ వ‌చ్చింది. అయితే ఈలోపే `ఆర్సీ 15` ఆగిపోయిందంటూ ప్ర‌చారాలు మొద‌ల‌య్యాయి.

అందుకు కార‌ణం లేక‌పోలేదు.. మ‌ధ్యలో ఆగిపోయిన త‌న లాస్ట్ ప్రాజెక్ట్ `ఇండియ‌న్ 2`పై డైరెక్ట‌ర్ శంక‌ర్ మ‌ళ్లీ దృష్టి సారించారు. షూటింగ్ ను రీస్టార్ట్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. దీంతో శంక‌ర్ `ఆర్సీ 15`ను కొన్నాళ్లు ప‌క్క‌న పెట్టేయ‌బోతున్నాడంటూ వార్త‌లు పుట్టుకొచ్చాయి. ఈ వార్త‌లు చ‌ర‌ణ్‌ అభిమానుల‌ను ఎంత‌గానో క‌ల‌వ‌ర పెట్టాయి. అయితే ఆ వార్త‌లు కేవ‌లం పుకార్లే అని శంక‌ర్ తేల్చేశారు.

ఈ మేర‌కు `హాయ్.. ఎవ్రీ వన్.. ఇండియన్ 2, ఆర్సీ 15 రెండు కూడా ఒకేసారి షూటింగ్ జరుగుతాయి.. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో హైదరాబాద్, వైజాగ్ లో ఆర్సీ 15 షూటింగ్ కు రెడీగా ఉండండి..` అంటూ శంకర్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా `ఆర్సీ 15`కు సంబంధించి మెగా అభిమానులు ఖుషీ అయ్యే ఓ క్రేజీ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అదేంటంటే.. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంటోంది. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ను సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభించ‌బోతున్నార‌ట‌. ఇందుకు మేక‌ర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్ మోస్ట్ 90 శాతం షూటింగ్ పూర్తయిపోతుందని.. అక్టోబ‌ర్ నాటికి సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేసేస్తార‌ని టాక్ నడుస్తోంది. ఇక అతి త్వరలో టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా లాంఛ్ చేయ‌బోతున్నార‌ని అంటున్నారు.

కాగా, వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ బ‌డా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌ భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ సినిమా విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అలాగే ఇందులో చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది.