Begin typing your search above and press return to search.
RRR హీరోలు మారారు.. ధోని- రైనా దోస్తులతో
By: Tupaki Desk | 3 July 2021 1:30 PM GMT2021 -22 మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాలో ఆర్.ఆర్.ఆర్ అగ్రతాంబూలం అందుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరు టాలీవుడ్ అగ్ర హీరోలతో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చేస్తున్న అసాధారణ ప్రయత్నంగా ఇండస్ట్రీలు భావిస్తున్నాయి. ఈ సినిమాని నభూతోనభవిష్యతి అన్న చందంగా ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు జక్కన్న టీమ్ ఎంతగా శ్రమిస్తున్నారో చూస్తున్నదే. ఇప్పటికే భారీ బిజినెస్ ని పూర్తి చేసుకున్న ఆర్.ఆర్.ఆర్ థియేటర్లలోకి ఎప్పుడొస్తుందా? అన్న ఆత్రం మార్కెట్ వర్గాలు సహా అందరిలోనూ ఉంది.
సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతోంది కాబట్టి ఈ సినిమా రిలీజ్ తేదీపై రాజమౌళి అండ్ టీమ్ కి క్లారిటీ వచ్చేస్తుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ కథానాయకులుగా నటించిన ఈ సినిమాకి చిత్రబృందాన్ని మించి నెటిజనుల ప్రమోషన్ కావాల్సినంతగా దక్కుతోంది. తాజాగా తారక్-చరణ్ బైక్ పై వెళ్లే ఓ పోస్టర్ సోషల్ మీడియాల్లో ఇప్పటికే ఎంతో వైరల్ అయ్యింది. తాజాగా ఆ పోస్టర్ లో ముఖ మార్పిడితో కొత్త పోస్టర్ మరింతగా వైరల్ అవుతోంది.
రామ్ చరణ్ -ఎన్టీఆర్ ముఖాలను టీం ఇండియా క్రికెటర్లు.. గ్రేట్ ఫ్రెండ్స్ ఎంఎస్ ధోని - సురేష్ రైనాలతో మార్ఫింగ్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ముఖాల్ని సవరించిన పోస్టర్ వెబ్ లో సునామీ స్పీడ్ తో వైరల్ అయిపోతోంది. ఈ పోస్టర్ క్రికెట్ అభిమానుల్లో కలకలం రేపుతోంది.
ఆసక్తికరంగా చిత్రబృందం ఈ పోస్టర్ పై స్పందించింది. ``వేలాదిగా వరదలా సవరణలు చూస్తున్నాం.. ఈ పోస్టర్ కి నిజమైన సారాంశం.. గొప్ప బంధం స్నేహాన్ని కలిగి ఉండటం .. ఇలా చూడటం హృదయాన్ని టచ్ చేస్తోంది`` అని డీవీవీ బ్యానర్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ హీరోలు మారారు! అంటూ నెటిజనులు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. చూస్తుంటే ధోని- రైనాలను కూడా ఆర్.ఆర్.ఆర్ మూవీలో చేర్చి ఒక సీన్ ని పండిస్తే అది జాతీయ స్థాయిలో ఆడియెన్ కి మరింత అద్భుతంగా కనెక్టవుతుందనే అభిమానులు భావిస్తున్నారు.. జక్కన్న- విజయేంద్ర ప్రసాద్ టీమ్ కాస్త ఆ కోణంలో ఆలోచిస్తే బావుంటుందేమో!
ఆర్.ఆర్.ఆర్ పెండింగ్ చిత్రీకరణను వేగంగా పూర్తి చేసి తదుపరి నిర్మాణానంతర పనుల్ని వేగంగా పూర్తి చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ముందే ప్రకటించినట్టే దసరా కానుకగా అక్టోబర్ లో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కావాలనే ఆశిస్తున్నారు. ఒకవేళ డేట్ మారితే 2022 సంక్రాంతి బరిలో వచ్చేందుకు వీలుందని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి.
సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతోంది కాబట్టి ఈ సినిమా రిలీజ్ తేదీపై రాజమౌళి అండ్ టీమ్ కి క్లారిటీ వచ్చేస్తుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ - ఎన్టీఆర్ కథానాయకులుగా నటించిన ఈ సినిమాకి చిత్రబృందాన్ని మించి నెటిజనుల ప్రమోషన్ కావాల్సినంతగా దక్కుతోంది. తాజాగా తారక్-చరణ్ బైక్ పై వెళ్లే ఓ పోస్టర్ సోషల్ మీడియాల్లో ఇప్పటికే ఎంతో వైరల్ అయ్యింది. తాజాగా ఆ పోస్టర్ లో ముఖ మార్పిడితో కొత్త పోస్టర్ మరింతగా వైరల్ అవుతోంది.
రామ్ చరణ్ -ఎన్టీఆర్ ముఖాలను టీం ఇండియా క్రికెటర్లు.. గ్రేట్ ఫ్రెండ్స్ ఎంఎస్ ధోని - సురేష్ రైనాలతో మార్ఫింగ్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ముఖాల్ని సవరించిన పోస్టర్ వెబ్ లో సునామీ స్పీడ్ తో వైరల్ అయిపోతోంది. ఈ పోస్టర్ క్రికెట్ అభిమానుల్లో కలకలం రేపుతోంది.
ఆసక్తికరంగా చిత్రబృందం ఈ పోస్టర్ పై స్పందించింది. ``వేలాదిగా వరదలా సవరణలు చూస్తున్నాం.. ఈ పోస్టర్ కి నిజమైన సారాంశం.. గొప్ప బంధం స్నేహాన్ని కలిగి ఉండటం .. ఇలా చూడటం హృదయాన్ని టచ్ చేస్తోంది`` అని డీవీవీ బ్యానర్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ హీరోలు మారారు! అంటూ నెటిజనులు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. చూస్తుంటే ధోని- రైనాలను కూడా ఆర్.ఆర్.ఆర్ మూవీలో చేర్చి ఒక సీన్ ని పండిస్తే అది జాతీయ స్థాయిలో ఆడియెన్ కి మరింత అద్భుతంగా కనెక్టవుతుందనే అభిమానులు భావిస్తున్నారు.. జక్కన్న- విజయేంద్ర ప్రసాద్ టీమ్ కాస్త ఆ కోణంలో ఆలోచిస్తే బావుంటుందేమో!
ఆర్.ఆర్.ఆర్ పెండింగ్ చిత్రీకరణను వేగంగా పూర్తి చేసి తదుపరి నిర్మాణానంతర పనుల్ని వేగంగా పూర్తి చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ముందే ప్రకటించినట్టే దసరా కానుకగా అక్టోబర్ లో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కావాలనే ఆశిస్తున్నారు. ఒకవేళ డేట్ మారితే 2022 సంక్రాంతి బరిలో వచ్చేందుకు వీలుందని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి.