Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ 'ప్రాజెక్ట్ కె' సెట్ లో RRR!

By:  Tupaki Desk   |   20 Jun 2022 8:30 AM GMT
ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కె సెట్ లో RRR!
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతంత బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా బిజీ బీజీగా గ‌డిపేస్తున్నారు. భారీ అంచ‌నాలు పెట్టుకున్న 'రాధేశ్యామ్‌' ఆశించిన రిజ‌ల్ట్ ని అందించ‌క‌పోవ‌డంతో ప్ర‌భాస్ తో పాటు ఆయ‌న ఫ్యాన్స్ కూడా ఈ మూడు ప్రాజెక్ట్ ల‌పైనే ఆశ‌లు పెట్టుకున్నారు. ఇప్ప‌టికే ఇందులో ప్ర‌భాస్ న‌టిస్తున్న తొలి మైథ‌లాజిక‌ల్ మూవీ 'ఆది పురుష్‌' షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా గ్రాఫిక్స్ ప‌నుల్లో వుంది. ఈ మూవీని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే చిత్ర మేక‌ర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా ప్ర‌క‌టించేసిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ పూర్త‌యిపోవ‌డంతో ప్ర‌భాస్ ప్ర‌స్తుతం 'కేజీఎఫ్' ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో రూపొందుతున్న‌ 'స‌లార్‌' షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా వుంటే ఈ షూట్ కి బ్రేకిచ్చిన ప్ర‌భాస్ ఇటీవ‌లే 'మ‌హాన‌టి' ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సైన్స్ ఫిక్ష‌న్ 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ప్ర‌తిష్టాత్మ వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ లో భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ ఈ మూవీని దాదాపు 500 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా ప‌దుకునే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ గ‌త కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది. ప్ర‌భాస్‌, దీపికా ప‌దుకునే, బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ పాల్గొన‌గా ప‌లు కీల‌క గ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. ఇటీవ‌ల హీరోయిన్ దీపిక అస్వ‌స్థ‌ల‌కు గురి కావ‌డం, ప్ర‌భాస్ ముంబై వెళ్ల‌డంతో కొంత వ‌ర‌కు బ్రేకిచ్చిన చిత్ర బృందం మ‌ళ్లీ ఈ మూవీ కీల‌క షూటింగ్ ని మొద‌లు పెట్టింది.

ఈ సెట్ లోకి ఏపీ ఎంపీ, వైసీపీ బ‌హిషృత నేత ర‌ఘ‌రామ కృష్ణంరాజు ఎంట్రీ ఇచ్చారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.

ప్ర‌భాస్‌, అమితాబ్ బ‌చ్చ‌న్ ల‌తో నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో నా మిత్రుడు అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్న మూవీ షూటింగ్ జ‌రుగుతున్న‌సెట్ లో అడుగు పెట్టాను. భారీ సెట్ లు, ఆ వాతావ‌ర‌ణం చూసి మ‌తిపోయింది. నో డౌట్ ఈ సినిమా భార‌తీయ సినీ ప్రియుల్ని గ‌ర్వ‌ప‌డేలా చేస్తుంది. అంతే కాకుండా అమితాబ్ బ‌చ్చ‌న్ గారితో విలువైన స‌మ‌యాన్ని గ‌డిపాను. ఆయ‌న సూప‌ర్ స్టార్ అయినా చాలా సింపుల్ గా వున్నారు.

ఆయ‌న నుంచి చాలా నేర్చుకోవాలి. ఈ సంద‌ర్భంగా 'ప్రాజెక్ట్ కే'తో చిత్ర బృందానికి, వైజ‌యంతీ మూవీస్ కి భారీ స‌క్సెస్ రావాల‌ని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ ల‌లో సెట్ లో ప్ర‌భాస్‌, అమితాబ్ తో వున్న ఒక్క ఫొటోని కూడా షేర్ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. సెట్ లోకి వెళ్లిన ఆయ‌న మ‌రి ఆ ఫొటోలు ఎందుకు షేర్ చేయ‌లేదో అని నెటిజ‌న్ లు కామెంట్ లు చేస్తున్నారు.