Begin typing your search above and press return to search.

బాల‌య్య‌తో నాని ప్రొడ్యూస‌ర్స్ బిగ్ డీల్

By:  Tupaki Desk   |   19 Feb 2022 11:30 AM GMT
బాల‌య్య‌తో నాని ప్రొడ్యూస‌ర్స్ బిగ్ డీల్
X
`అఖండ‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత స్టార్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ మాంచి జోరు మీదున్నారు. ఈ మూవీ త‌రువాత వ‌రుస‌గా సినిమాలని లైన్ లో పెడుతున్నారు. ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేస్తున్న చిత్రంలో న‌టిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ శుక్ర‌వారం లాంఛ‌నంగా మొద‌లైంది.

గ‌త చిత్రాల‌కు మించి ఈ మూవీలో బాల‌య్య డిఫ‌రెంట్ మేకోవ‌ర్ తో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. తొలి రోజు షూటింగ్ ని యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తో ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఓ స్టిల్ నెట్టింట వైర‌ల్ గా మారంది.

సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో బాల‌య్య మీసం మెలేసి క‌నిపిస్తుండ‌గా ప‌క్క‌న మ‌ల‌యాళ న‌టుడు లాల్ నిల‌బ‌డి క‌నిపిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ వేట పాలెం నేప‌థ్యంలో జ‌రిగిన ప‌లు య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిస్తున్నారు.

క‌న్న‌డ హీరో దునియా విజ‌య్ విల‌న్ గా న‌టిస్తుండ‌గా ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ క‌నిపించ‌బోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత బాల‌య్య మ‌రో భారీ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్ అంశాల నేప‌థ్యంలో `ఎఫ్ 3`ని రూపొందించారు. `ఎఫ్ 2`కు సీక్వెల్ రూపొందిన ఈ మూవీ మే 27న విడుద‌ల కు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ మూవీ త‌రువాత హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అనిల్ రావిపూడి ఓ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే బాల‌య్య‌కు స్క్రిప్ట్ ని ద‌ర్శ‌కుడు వినిపించార‌ట‌. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్ టైన‌ర్‌ కావ‌డంతో బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ ని ద‌ర్శ‌కుడు ప్రారంభించిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ మూవీని నేచుర‌ల్ స్టార్ నానితో `ట‌క్ జ‌గ‌దీష్ ` చిత్రాన్ని నిర్మించిన షైన్ స్క్రీన్స్ అధినేత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మించ‌నున్నారని తెలిసింది.

ఈ ప్రాజెక్ట్ ని దిల్ రాజు చేయ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపించిన విష‌యం తెలిసిందే. త‌జా వార్త‌ల నేప‌థ్యంలో అనిల్ రావిపూడి, బాల‌కృష్ణ ఇద్ద‌రూ దిల్ రాజుకు షాకిచ్చార‌ని, మొద‌టి నుంచి త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ని షైన్ స్క్రీన్స్ వారికి చేయాల‌ని క‌మిట్ అయ్యార‌ని ఆ కార‌ణంగానే ఈ ప్రాజెక్ట్ ని దిల్ రాజుతో కాకుండా షైన్ స్క్రీన్స్ అధినేత‌లు సాహు గార‌పాటి , హ‌రీష్ పెద్ద‌ల‌కు చేస్తున్నార‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. కాగా ఈ మూవీని షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూస‌ర్స్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నార‌ని తెలిసింది.