Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ స‌ర‌స‌న కొత్త‌మ్మాయ్.. డైరెక్ట‌ర్ రిక‌మండేష‌న్‌?

By:  Tupaki Desk   |   29 Oct 2021 1:30 AM GMT
ప‌వ‌న్ స‌ర‌స‌న కొత్త‌మ్మాయ్.. డైరెక్ట‌ర్ రిక‌మండేష‌న్‌?
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు- భీమ్లా నాయ‌క్ చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి చేస్తున్నారు. త‌దుప‌రి హరీష్ శంక‌ర్.. సురేంద‌ర్ రెడ్డిల‌తో సినిమాలు చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఓ సినిమాకి సైన్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత సినిమాలను పూర్తి చేశాక హ‌రీష్ తో ప‌వ‌న్ 28వ‌ సినిమా ఉంటుంది. సైమల్టేనియ‌స్ గానే సూరితో ప‌వ‌న్ జాయిన‌వుతారు. సూరితో ప‌వ‌న్ కెరీర్ 29వ సినిమా ఇది. పీఎస్ పీకే 29 టైటిల్ తో ఈ చిత్రాన్ని ప్రారంభించే ముందు తన రాజకీయ క‌మిట్ మెంట్ల‌ను ప‌వ‌న్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈలోగానే సురేంద‌ర్ రెడ్డి ప్రీప్రొడ‌క్ష‌న్ ని వేగంగా పూర్తి చేసి క‌థానాయిక‌ను ఇత‌ర కాస్టింగ్ ని ఫైన‌ల్ చేసే ప‌నిలో ఉన్నార‌ట‌. తాజా స‌మాచారం మేర‌కు కథానాయికగా ముంబై బ్యూటీ సాక్షి వైద్యను ఎంపిక చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆసక్తిగా ఉన్నారని తెలిసింది. అధికారిక ధృవీకరణ లేనప్పటికీ మేకర్స్ కాస్టింగ్ ఎంపిక‌లు.. ఇతర ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నార‌ని క‌థానాయిక‌ను ఓకే చేశార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సాక్షి తెలుగులో హీరో అఖిల్ అక్కినేని స‌ర‌స‌న ఏజెంట్ లో న‌టిస్తోంది. థ్రిల్లర్ కాన్సెప్టుతో రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. సాక్షి పని తీరు సూరికి న‌చ్చి ప‌వ‌న్ కోసం రిక‌మండ్ చేశార‌ట‌. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న `భవదీయుడు భగత్ సింగ్` చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసిన తర్వాత PSPK29 సెట్స్‌పైకి వెళుతుంది.

భీమ్లా నాయ‌క్ .. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రాల్లోనూ ప‌వ‌న్ స‌ర‌స‌న ప‌లువురు టాప్ హీరోయిన్లు న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిత్యా మీన‌న్.. నిధి అగ‌ర్వాల్ లాంటి అందాల నాయిక‌లు ప‌వ‌న్ స‌ర‌స‌న‌ న‌టిస్తున్నారు. ఇప్పుడు హ‌రీష్ త‌న ఫేవ‌రెట్ పూజా హెగ్డేని లాక్ చేయ‌గా.. సురేంద‌ర్ రెడ్డి కొత్త క‌థానాయిక సాక్షి వైద్య‌ను ఎంపిక చేసుకున్నారు.