Begin typing your search above and press return to search.
RRR ప్రమోషన్స్ కోసం బరిలో సల్మాన్ ..!
By: Tupaki Desk | 20 Nov 2021 4:30 AM GMTఇండియాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` జనవరిలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచారంలో వేగం పెంచింది టీమ్. ప్రస్తుతం లిరికల్ సింగిల్స్ ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. వచ్చే నెలలో టీజర్.. అటుపై ట్రైలర్ తో పెద్ద ట్రీట్ ఉండబోతోంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన చిత్రం కాబట్టి 1000 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి రాబోతుంది. మరి ఇలాంటి చిత్రాన్ని ఏ రేంజ్ లో ప్రమోట్ చేయాలి. టీమ్ అంతా దేశం మొత్తం చుట్టేయాల్సిన అవసరం ఉంది. అవసరం మేర ఇతర భాష బిగ్ స్టార్స్ ని రంగంలోకి దించాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్ ని రంగంలోకి దించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
ముంబైలో కుమారుడు కార్తికేయతో రాజమౌళి మీడియా కంట పడిన సంగతి తెలిసిందే. మరి ముంబైలో జక్కన్నకు పనేంటి? అంటే సల్మాన్ ని ప్రమోషన్ కోసం ఆహ్వానించాలని కుమారుడిని వెంట పెట్టుకుని వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ కి బాలీవుడ్ మార్కెట్ కీలకం కాబట్టి అక్కడ ముందుండి సల్మాన్ ప్రమోట్ చేస్తే కోట్లాది రూపాయల పబ్లిసిటీ ఉచితంగానే దొరుకుతుంది. సినిమాలో అజయ్ దేవగణ్.. ఆలియా భట్ తదితరులు నటించిన ఈ సినిమా కోసం సల్మాన్ భాయ్ ముందుంటే సినిమాకి దక్కే బజ్ మరో లెవల్లో ఉంటుంది. అందుకే జక్కన్న ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత? అన్నది తేలాల్సి ఉంది.
ఆ సంగతిని పక్కనబెడితే! సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో `భజరంగి భాయిజాన్` చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ముందుగా జక్కన్నకే దక్కింది. విజయేంద్ర ప్రసాద్ రచించిన కథకి కుమారుడు రాజమౌళి దర్శకత్వం వహించాలని ఆయన ఎంతగానో ఆశపడ్డారు. కానీ ఆ సమయంలో రాజమౌళి `బాహుబలి` షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారు. తర్వాత ఆ చిత్రాన్ని కి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇప్పుడు సల్మాన్ తో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ మాత్రమేనా తదుపరి సినిమాకి కాల్షీట్లు కూడా అడిగేస్తారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
ముంబైలో కుమారుడు కార్తికేయతో రాజమౌళి మీడియా కంట పడిన సంగతి తెలిసిందే. మరి ముంబైలో జక్కన్నకు పనేంటి? అంటే సల్మాన్ ని ప్రమోషన్ కోసం ఆహ్వానించాలని కుమారుడిని వెంట పెట్టుకుని వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ కి బాలీవుడ్ మార్కెట్ కీలకం కాబట్టి అక్కడ ముందుండి సల్మాన్ ప్రమోట్ చేస్తే కోట్లాది రూపాయల పబ్లిసిటీ ఉచితంగానే దొరుకుతుంది. సినిమాలో అజయ్ దేవగణ్.. ఆలియా భట్ తదితరులు నటించిన ఈ సినిమా కోసం సల్మాన్ భాయ్ ముందుంటే సినిమాకి దక్కే బజ్ మరో లెవల్లో ఉంటుంది. అందుకే జక్కన్న ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత? అన్నది తేలాల్సి ఉంది.
ఆ సంగతిని పక్కనబెడితే! సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో `భజరంగి భాయిజాన్` చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ముందుగా జక్కన్నకే దక్కింది. విజయేంద్ర ప్రసాద్ రచించిన కథకి కుమారుడు రాజమౌళి దర్శకత్వం వహించాలని ఆయన ఎంతగానో ఆశపడ్డారు. కానీ ఆ సమయంలో రాజమౌళి `బాహుబలి` షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించారు. తర్వాత ఆ చిత్రాన్ని కి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇప్పుడు సల్మాన్ తో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ మాత్రమేనా తదుపరి సినిమాకి కాల్షీట్లు కూడా అడిగేస్తారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.