Begin typing your search above and press return to search.

స‌మంత లేదు.. అయినా మొద‌లెట్టేశారు

By:  Tupaki Desk   |   21 April 2022 9:30 AM GMT
స‌మంత లేదు.. అయినా మొద‌లెట్టేశారు
X
వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాలు చేస్తున్నారు రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. బాక్సింగ్ నేప‌థ్యంలో రూపొందుతున్న 'లైగ‌ర్‌' మూవీ షూటింగ్ ఇటీవ‌లే పూర్త‌యిపోవ‌డంతో వెంట‌నే మ‌రో చిత్రాన్ని స్టార్ట్ చేశారు. పూరి జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న 'జేజీఎమ్‌' (జ‌న‌గ‌ణ‌మ‌న‌) చిత్రాన్ని ఇటీవ‌లే ముంబైలో పూరి జ‌గ‌న్నాథ్ లాంఛ‌నంగా ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఏప్రిల్ నుంచే ప్రారంభం కానుంది. దేశ భ‌క్త ప్ర‌ధానంగా సాగ‌నున్న ఈ మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ మిల‌ట‌రీ ఆఫీస‌ర్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

ఇదిలా వుంటే తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించారు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీమేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా రూపొంద‌నున్న ఈమూవీ క‌శ్మీర్ నేప‌థ్యంలో సాగుతుంద‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

తాజాగా బుధ‌వారం ఈ మూవీని హైద‌రాబాద్ లో మేక‌ర్స్ లాంఛ‌నంగా ప్రారంభించారు. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి దర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ క్లాప్ నివ్వ‌గా 'ఉప్పెన‌' ఫేమ్ బుచ్చిబాబు సాన కెమెరా స్విఛాన్ చేశారు.

మేక‌ర్స్ స్క్రిప్ట్ ని ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌కు అంద‌జేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న 11వ చిత్ర‌మిది. స‌మంత ఈ చిత్రం లో విజ‌య్ కి జోడీగా న‌టించ‌నుంది. 'మ‌హాన‌టి' చిత్రంలో తొలిసారి స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి జంట‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. అయితే తొలిసారి శివ నిర్వాణ తెర‌కెక్కిస్తున్న రొమాంటిక్ ల‌వ్ స్టోరీలో క‌లిసి జంట‌గా న‌టిస్తుండ‌టంతో ఈ మూవీపై మంచి బ‌జ్ క్రియేట్ అయింది. ఇదిలా వుంటే బుధ‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ మూవీ ఓపెనింగ్ కు స‌మంత హాజ‌రు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ షూట్ కోసం దుబాయ్ లో వున్న స‌మంతా ఈ మూవీ లాంఛింగ్ సెర్మ‌నీలో పాల్గొన‌లేక‌పోయింది. త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ క‌శ్మీర్ లో ప్రారంభం కానుంద‌ని తెలిసింది. అక్క‌డే కీల‌క షెడ్యూల్ ని పూర్తి చేసి చిత్ర బృందం హైద‌రాబాద్ తిరిగి రానుంద‌ట‌. ఇక్క‌డ కొన్ని కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ అనంత‌రం అల‌ప్పీ, వైజాగ్ ల‌లో మిగ‌తా భాగాన్ని పూర్తి చేయ‌నున్నార‌ని తెలిసింది.

జ‌య‌రామ్‌, స‌చిన్ ఖేడేక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌ర‌లు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న మ‌మేకోవ‌ర్ ని పూర్తిగా మార్చేశాడు. తాజాగా సినిమా ఓపెనింగ్ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఈ చిత్రానికి ప‌వ‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'ఖుషీ' టైటిల్ ని అనుకుంటున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.