Begin typing your search above and press return to search.

లేటెస్ట్ ఫోటోలు: మైయోసైటిస్ వ్యాధి కారణంగా సమంత ఇలా మారిపోయింది..!

By:  Tupaki Desk   |   7 Nov 2022 9:38 AM GMT
లేటెస్ట్ ఫోటోలు: మైయోసైటిస్ వ్యాధి కారణంగా సమంత ఇలా మారిపోయింది..!
X
దక్షిణాది అగ్ర కథనాయిక సమంత రూత్ ప్రభు మైయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. బెడ్ మీద చికిత్స తీసుకుంటున్న ఓ ఫోటోని షేర్ చేసి సమ్ తన అనారోగ్యం గురించి చెప్పడంతో.. ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన హీరోయిన్ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత.. ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం.. షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వడమే కాకుండా బయట ఎక్కడ కనిపించకపోవడానికి కారణం ఆమె అనారోగ్యంతో బాధపడుతుండటమే అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టిివ్ గా కనిపిస్తున్న సామ్.. మళ్ళీ మీడియా ముందుకు రావడానికి రెడీ అయింది.

సమంత ప్రధాన పాత్రలో నటించిన "యశోద" సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా థ్రిల్లర్ నవంబర్ 11న తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. సామ్ ఆరోగ్య పరిస్థితి కారణంగా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటూ వస్తోంది.

ఇందులో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్ - ఉన్ని కృష్ణన్ లలో పాటుగా చిత్ర దర్శకర్మాతలు కొన్ని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడిన తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు ఇంటర్వ్యూల ద్వారా "యశోద" ప్రమోషన్స్ చేయటానికి సమంత సిద్దమైంది.

కొన్ని నెలలుగా తన ముఖం కనిపించే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయని సామ్.. తాజాగా రెండు ఫొటోలను అప్‌ లోడ్ చేసింది. ఇందులో ఆమె బ్లాక్ డ్రెస్ మరియు నల్ల కళ్లద్దాలను ధరించి ఉంది. గత కొన్ని రోజలుగా అనారోగ్యంతో బాధ పడిందనే విషయం ఆమె కళ తప్పిపోయిన ఫేస్ లో తెలుస్తోంది.

ఈ సందర్భంగా "నా మంచి స్నేహితుడు రాజ్ & డీకే చెప్పినట్లుగా.. రోజు ఎలా ఉన్నా, ఎంత చెత్తగా ఉన్నా షేవ్ చేసుకొని షవర్ చేసి చూపించు అనేది అతని నినాదం. 'యశోద' మూవీ ప్రమోషన్స్ కోసం నేను ఒక రోజు దాన్ని అప్పు తీసుకున్నాను. ఈ 11న కలుద్దాం" అని సమంతా తన పోస్ట్ లో పేర్కొంది.

సామ్ చాలా కాలం తర్వాత కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా కోలుకోవాలని.. స్ట్రాంగ్ ఉండాలని కామెంట్స్ రూపంలో ఆమెకు ధైర్యం చెబుతున్నారు. అయితే సమంత కేవలం ఒక్క ప్రమోషనల్ ఇంటర్వ్యూకే పరిమితం అవుతుందని.. మిగతా కార్యక్రమాల్లో పాల్గొనదని టాక్ వినిపిస్తోంది.

'యశోద' చిత్రంలో సమంతా సరోగంట్ మదర్ గా కనిపించనుంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. దర్శకద్వయం హరి & హరీష్ తెరకెక్కించారు. దీనికి మణిశర్మ సంగీతం సమకుర్చగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేశారు. సామ్ చాలా గ్యాప్ తర్వాత నేరుగా తెలుగులో నటించిన ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.