Begin typing your search above and press return to search.

మొదట విమర్శించారు ఇప్పుడు పట్టించుకోవడం లేదు

By:  Tupaki Desk   |   18 March 2020 5:00 AM GMT
మొదట విమర్శించారు ఇప్పుడు పట్టించుకోవడం లేదు
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత 2019 మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ గా నిలిచిన విషయం తెల్సిందే. పెళ్లి అయిన తర్వాత మూడు పదుల వయసులో పలువురు స్టార్‌ హీరోయిన్స్‌ ఉన్న సమయంలో మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ గా సమంత ఎంపిక అవ్వడం ఆమె ఇంకా ఏ స్థాయిలో స్టార్‌ డంను కలిగి ఉందో చెప్పకనే చెప్పవచ్చు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెబుతుందని అంతా అనుకున్నారు. కాని కమర్షియల్‌ పాత్రలతో పాటు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు కూడా చేస్తూ కెరీర్‌ ను కొనసాగిస్తుంది.

ఇక హీరోలను పెళ్లి చేసుకున్న తర్వాత కాస్త కట్టుబాట్లను ఫ్యాన్స్‌ పెడుతూ ఉంటారు. నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి కోడలు అయిన కారణంగా సమంత హాట్‌ గా కనిపించవ ద్దని.. ఇతర హీరోలతో రొమాన్స్‌ చేయవద్దంటూ అప్పుడు సోషల్‌ మీడియాలో కొందరు ఆంక్షలు పెట్టారు. రంగస్థలం చిత్రంలో రామ్‌ చరణ్‌ తో మరీ క్లోజ్‌ రొమాన్స్‌ చేస్తేనే ఆమెపై విమర్శలు వచ్చాయి. అలాంటిది తనకు ఇష్టం వచ్చిన కాస్ట్యూమ్స్‌ ను ధరిస్తూ హాట్‌ గా సమంత కనిపిస్తూ ఉంది.

ఆ విషయమై సమంత మాట్లాడుతూ.. పెళ్లి అయిన కొత్తలో కాస్త ఎక్స్‌ పోజింగ్‌ చేస్తూ డ్రస్‌ వేసుకుంటే నన్ను ట్రోల్స్‌ చేసేవారు. నేను వాటిని పట్టించుకోకుండా అలాగే కంటిన్యూ చేస్తుంటే ఇప్పుడు ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు అంది. అంటే మనం మొదట ఏదైనా డేరింగ్‌ స్టెప్‌ వేయాలి. ఆ తర్వాత అంతా కూడా సైలెంట్‌ అవుతారు అంటూ సమంత చెప్పుకొచ్చింది.

పెళ్లి తర్వాత నా సినీ కెరీర్‌ పై ఆశలు పెట్టుకోలేదు. ఎంతో మంది హీరోయిన్స్‌ మాదిరిగానే నేను కూడా ఫేడ్‌ ఔట్‌ అవుతాను అనుకున్నాను. కాని చైతూ సపోర్ట్‌ తో నా ఫ్యామిలీ మెంబర్స్‌ సపోర్ట్‌ తో హీరోయిన్‌ గానే కొనసాగుతున్నాను అంది. ఛాన్స్‌ లు వచ్చే వరకు సినిమాు చేస్తూనే ఉంటాను. ఛాన్స్‌ లు రాని సమయంలో ఇండస్ట్రీలోనే నిర్మాత గానో లేదా మరో రకంగానో ఉంటానంది.