Begin typing your search above and press return to search.

బాలయ్య గీత ఆర్ట్స్ కోసం సర్కారు వారి పాట

By:  Tupaki Desk   |   31 Oct 2022 8:30 AM GMT
బాలయ్య గీత ఆర్ట్స్ కోసం సర్కారు వారి పాట
X
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహా రెడ్డి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. వచ్చే సంవత్సరం సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమా విడుదల కాబోతుంది. వచ్చే ఏడాదిలోనే అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాను కూడా విడుదల చేసే విధంగా బాలయ్య ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సమయంలోనే మరో సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది.

ఆహా లో అన్‌ స్టాపబుల్‌ షో చేస్తున్న నందమూరి బాలకృష్ణ తో అల్లు అరవింద్ కి మరింత సన్నిహిత సంబంధం ఏర్పడింది. చాలా కాలం నుండే బాలయ్య.. అల్లు అరవింద్ ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికి కొన్ని కారణాల వల్ల గీతా ఆర్ట్స్ లో సినిమాను బాలయ్య చేయలేక పోయాడు. ఎట్టకేలకు అన్ స్టాపబుల్‌ కారణంగా బాలయ్య గీతా ఆర్ట్స్ సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది.

తాజాగా ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో బాలయ్య పాల్గొన్నాడు. గీతా ఆర్ట్స్ వారి సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనడంతో ఆ బ్యానర్‌ లో బాలయ్య సినిమా ఉంటుందని మరింత స్పష్టం అయ్యింది. అదే సందర్భంగా సర్కారు వారి పాట చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు పరశురామ్‌ మాట్లాడుతూ బాలయ్య తో సినిమా కన్ఫర్మ్‌ చేశాడు.

సర్కారు వారి పాట సినిమా తర్వాత నాగ చైతన్య తో సినిమా అనుకున్నప్పటికి కూడా కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. దాంతో గత కొన్నాళ్లు గా బాలయ్య కోసం పరశురామ్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ టీమ్‌ తో కలిసి బాలయ్య కోసం పరశురామ్‌ కథను రెడీ చేశాడని తెలుస్తోంది. అతి త్వరలోనే దాన్ని బాలయ్య గారికి వినిపించబోతున్నట్లుగా పరశురామ్‌ స్వయంగా ప్రకటించాడు.

మొత్తానికి గీతా ఆర్ట్స్ బ్యానర్‌ లో బాలకృష్ణ హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్ ఒక భారీ యాక్షన్ మాస్ ఎంటర్‌ టైనర్‌ సినిమా ను నిర్మించబోతున్నట్లుగా దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యింది. ఈ కాంబో మూవీ 2024 సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.