Begin typing your search above and press return to search.

రియ‌ల్ కాదు రీల్ కెమిస్ర్టీ చూడండి! పూజాహెగ్డే

By:  Tupaki Desk   |   9 March 2022 9:50 AM GMT
రియ‌ల్ కాదు రీల్ కెమిస్ర్టీ చూడండి! పూజాహెగ్డే
X
'రాధేశ్యామ్' ప్ర‌మోష‌న్ లో భాగంగా ప్ర‌భాస్-పూజాహెగ్డేల ఎడ ముఖం..పెడ ముఖంగా వ్య‌వ‌హ‌రించిన తీరుతో ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు లేవ‌ని మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగిన సంగ‌తి తెలిసిందే. ఒకే వేదిక‌పై ఉన్నా క‌నీసం ఒక‌రి ముఖాలు ఒక‌రు చూసుకోక‌పోవ‌డం..ఎవ‌రి దారి వారిది అన్న‌ట్లు న‌డుచుకున్న విధానం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర‌మైన విబేధాలే ఉన్న‌ట్లు మీడియాలో క‌థ‌నాలు ప్ర‌సారం అయ్యాయి. ఇదే స‌మ‌యంలో 'రాధేశ్యామ్' ప్ర‌మోష‌న్ లో పాల్గొన్న ప్ర‌భాస్ 'ఆదిపురుష్' హీరుయిన్ కృతి స‌న‌న్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం ఉంద‌ని...త‌న‌తో కంప‌ర్ట్ గా ఉంటుంద‌ని ప్ర‌భాస్ అన్నారు. అయితే తాజాగా ప్ర‌భాస్ తో స‌రిగ్గా మాట్లాడ‌లేదు అని అంటున్నారు? నిజ‌మేనా అని ఓ ఇంట‌ర్వ్యూలో పూజాహెగ్గేకి ప్ర‌శ్న ఎదురైంది. దీనికి పూజాహెగ్డే తెలివైన స‌మాధానం ఇచ్చి త‌ప్పించుకోవాల‌ని చూసింది. కానీ అడ్డంగా బుక్కైంది. ఇద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రిగింద‌ని బ‌ల‌మైన సంకేతాలు పంపిన‌ట్లు అయింది ఆ స‌మాధానంతో. ఇంత‌కీ పూజాహెగ్డే అందుకు స‌మాధానంగా ఏమ‌ని చేప్పుకొచ్చిందంటే? నేను కూడా వింటున్నాను. కానీ నిజం కాని వాటిని ఎలా న‌మ్ముతారు.

కేవ‌లం సినిమాలో ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ర్టీ ఎలా ఉందో చూడాలో త‌ప్ప బ‌య‌ట కెమిస్ర్టీతో సంబంధం ఏంటి? అన్న‌ రీతిలో మాట్లాడింది. ఇలాంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించాల్సిన ప‌నిలేద‌ని అంది. ఆ స‌మాధానం బ‌ట్టే మ‌రోసారి ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు లేవ‌ని తెలుస్తోంద‌ని నెటి జ‌నులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

పూజాహెగ్డే ఇలా మాట్లాడ‌టానికి ఓ కార‌ణం కూడా ఉంద‌ని అంటున్నారు. ప్ర‌భాస్ నిన్న‌టి ఇంట‌ర్వ్యూలో 'రాధేశ్యామ్' హీరోయిన్ గురించి ఎక్క‌డా మాట్లాడ‌కుండా 'ఆదిపురుష్' హీరోయిన్ ని హైలైట్ చేయ‌డంతోనే..దానికి కౌంట‌ర్ గానే పూజా ఇలా వ్యాఖ్యానించిందంటూ కొంద‌రు భావిస్తున్నారు.

అయితే నిజం కాని వాటి గురించి న‌మ్మొద‌ని చెప్పింది కాబ‌ట్టి ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు లేక‌పోతే అలాంటి సమాధానం ఎందుకు చెబుతుంద‌ని ఇంకొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కార‌ణాలు ఏవైనా 'రాధేశ్యామ్' రిలీజ్ ముందు ఈ వివాదం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

టాలీవుడ్ లో పూజాహెగ్డే జెట్ స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ ల‌తో దూసుకుపోతుంది.మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'ఆచార్య‌'లో న‌టిస్తుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. మ‌రోవైపు సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రంలోనూ ఈ భామ‌నే హీరోయిన్ గా ఎంపికైంది. ఇక కోలీవుడ్ లో విజ‌య్ స‌ర‌స‌న 'బీస్ట్' లో న‌టిస్తోంది. ఇక‌ బాలీవుడ్ లో ర‌ణ‌వీర్ సింగ్ స‌ర‌స‌న 'సిర్క‌స్' లో న‌టిస్తోంది. రోహిత్ శెట్టి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇంకా మ‌రో రెండు ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసిన‌ట్లు స‌మాచారం.