Begin typing your search above and press return to search.

వైరల్ పిక్: రూ.200 కోట్ల స్కామ్ సూత్రధారితో 'వీరమల్లు' భామ కిస్సింగ్ సెల్ఫీ..!

By:  Tupaki Desk   |   1 Dec 2021 4:14 AM GMT
వైరల్ పిక్: రూ.200 కోట్ల స్కామ్ సూత్రధారితో వీరమల్లు భామ కిస్సింగ్ సెల్ఫీ..!
X
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రూ.200 కోట్ల స్కామ్ లో ప్రధాన సూత్రధారి సుకేష్ చంద్రశేఖర్ కు ముద్దు పెడుతూ దిగిన సెల్ఫీ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకముందు వీరిద్దరు తీసుకున్న మిర్రర్ సెల్ఫీలో జాక్వెలిన్ సిగ్గు పడుతూ నవ్వుతుండగా.. ఆమె చెంపపై సుకేష్ ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటోలో జాక్వెలిన్ అతన్ని గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకోవడం బీటౌన్ లో హాట్ టాపిక్ అయింది.

చెన్నై - బెంగళూరులలో ఎందరినో మోసగించారానే ఆరోపణలతో వ్యాపారవేత్త సుకేష్ చంద్రశేఖర్ పై 15 ఎఫ్ఐఆర్ లు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాన్ మ్యాన్ తీహార్ జైలులో ఉన్నాడు. మధ్యంతర బెయిల్ పై జైలు నుంచి విడుదలైన తర్వాత జాక్వెలిన్ - సుఖేశ్ మిర్రర్ సెల్ఫీ తీసుకుని ఉండొచ్చు అని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.

సుకేష్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు తెరపైకి వచ్చింది. జాక్వెలిన్ అతనితో డేటింగ్ చేస్తోందని సుకేష్ తరపు లాయర్ మీడియాకు వెల్లడించారు. అయితే దీనిపై జాక్వెలిన్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. సుకేష్ లేదా అతని భార్య, నటి లీనా మారియా పాల్ తో ఫెర్నాండెజ్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

అయితే ఆమె వివరణ ఇచ్చిన కొన్ని రోజులకే ఈడీ అధికారులు అక్టోబర్ లో జాక్వెలిన్ కు సమన్లు ​​పంపించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇప్పుడు జాక్వెలిన్ - సుకేష్ ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటున్న పాత సెల్ఫీలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుండటంతో.. ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి మళ్ళీ పుకార్లు షికారు చేస్తున్నాయి.

కాగా, మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు సుకేష్ కు చెందిన చెన్నైలోని విలాసవంతమైన బంగ్లాను సీజ్ చేశారు. అలానే ఈ కేసుకు సంబంధించి డజనుకు పైగా లగ్జరీ కార్లు - కొన్ని లక్షల నగదును జప్తు చేశారు. ఇకపోతే తీహార్ జైలులో నుంచే రూ.200 కోట్ల విలువైన దోపిడీ రాకెట్ ను నడుపుతున్నట్లు కూడా సదరు కాన్ మ్యాన్ పై ఆరోపణలు ఉన్నాయి. జైలు నుంచి కాలేకర్ ఐడీ స్ఫూఫింగ్ ద్వారా జాక్వెలిన్ ను సుఖేశ్ చంద్రశేఖర్ సంప్రదించాడనే ఆరోపణలు కూడా వచ్చాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. ‘సాహో’ లో డార్లింగ్ ప్రభాస్ తో కలిసి 'బ్యాడ్ బాయ్' అంటూ దక్షిణాది ప్రేక్షకులను పలకరించింది జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే 'బూత్ పోలీస్' సినిమాలో అలరించిన ఈ శ్రీలంకన్ బ్యూటీ.. ప్రస్తుతం 'ఎటాక్' 'విక్రాంత్ రోణ' 'బచ్చన్ పాండే' 'సర్కస్' 'రామ్ సేతు' వంటి చిత్రాల్లో నటిస్తోంది.