Begin typing your search above and press return to search.

ఎక్స్ ప్రెస్ శర్వా జోరు పెంచేశాడు

By:  Tupaki Desk   |   1 Feb 2017 11:44 PM IST
ఎక్స్ ప్రెస్ శర్వా జోరు పెంచేశాడు
X
యంగ్ హీరో శర్వానంద్ జోరు బాగా పెరిగిపోయింది. రీసెంట్ గా శతమానం భవతి బ్లాక్ బస్టర్ తో ఈ కుర్రాడి స్పీడ్ ఇంకా ఎక్కువైపోయింది. వరుసగా సినిమాలు అంగీకరించేస్తూ ఇండస్ట్రీ జనాలకు ఆశ్చర్యం కలిగిస్తున్నాడు. గతంలో ఒకటి తర్వాత ఒకటి చొప్పున వెర్సటైల్ మూవీలు చేసిన శర్వా.. ఇప్పుడు ఒకేసారి 2-3 సినిమాలు చేసేందుకు రెడీ అయిపోతున్నాడు.

శతమానం తర్వాత రీసెంట్ గా కొత్త దర్శకుడు చంద్రమోహన్ డైరెక్షన్ లో .. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఓ సినిమా లాంఛ్ చేశాడు శర్వా. మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం పట్టాలెక్కేయనుంది కూడా. ఇప్పటికే దర్శకుడు మారుతితో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు శర్వా. నిజానికి ఇదే ముందు ప్రారంభంకావాల్సి ఉంది కానీ.. స్క్రిప్ట్ ఇంకా రెడీ కాకపోవడంతోనే చంద్రమోహన్ మూవీ మొదట మొదలుపెట్టాడు శర్వానంద్. ఇప్పుడు ఉయ్యాలా జంపాలా.. మజ్ను వంటి చిత్రాలను తీసిన దర్శకసుడు విరించి వర్మతో కొత్త సినిమాకి రెడీ అయిపోతున్నాడు శర్వా.య

విరించి వర్మ చెప్పిన స్టోరీ విపరీతంగా నచ్చడంతో.. ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడట శర్వానంద్. ప్రస్తుతం ఈ హీరోకి ఉన్న కమిట్మెంట్స్ ప్రకారం ఆగస్ట్ నాటికి ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నిర్మాత ఎంఎల్ కుమార్ చౌదరి.. ఈ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/