Begin typing your search above and press return to search.

కరోనా నుండి కోలుకున్న నటికి పక్షవాతం

By:  Tupaki Desk   |   12 Dec 2020 9:10 AM GMT
కరోనా నుండి కోలుకున్న నటికి పక్షవాతం
X
సినీ ప్రముఖుల్లో కరోనా ప్రభావం తీవ్రంగానే కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు అన్ని భాషలకు చెందిన ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కొందరు కరోనాను జయించి మళ్లీ షూటింగ్‌ లతో బిజీ అవుతున్నారు. ఈ సమయంలోనే కొందరు ఇంకా అనారోగ్య సమస్యలతోనే ఉన్నారు. ఇటీవల బాలీవుడ్‌ నటి శిఖా మల్హోత్రా కరోనా బారిన పడ్డారు. ఇటీవలే ఆమె కరోనాను జయించారు. ఈసమయంలోనే మళ్లీ ఆమె అనారోగ్యం బారిన పడింది. మూడు వారాల పాటు కరోనాతో పోరాడిన ఆమె ఇప్పుడు పక్షవాతం కు గురైనట్లుగా తెలుస్తోంది.

శిఖ మల్హోత్ర కు శరీరంలో కుడి భాగం పూర్తిగా పక్షవాతం కారణంగా లేవకుండా అయ్యింది. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రిలో జాయిన్‌ చేసి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో నర్స్‌ గా మారి రోగులకు సేవ చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న నటి శిఖ ఇప్పుడు ఇలా ఆసుపత్రిలో జాయిన్‌ అవ్వడంతో బాలీవుడ్‌ వర్గాల వారు మరియు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌ లో ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం సినిమాలేమి చేయడం లేదు. కరోనా నుండి కోలుకున్న కొన్ని రోజుల్లోనే మళ్లీ ఇలా అవ్వడం బాధకరం.