Begin typing your search above and press return to search.

సినీ ఇండస్ట్రీకి షాక్..: 190 కిలోల గంజాయితో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్..

By:  Tupaki Desk   |   19 April 2022 10:31 AM GMT
సినీ ఇండస్ట్రీకి షాక్..: 190 కిలోల గంజాయితో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్..
X
టాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ వ్యవహారం కలిచి వేస్తోంది. సినీ ఇండస్ట్రీలో కొందరు డ్రగ్స్ వాడుతుతున్నారని అనుమానితులందరినీ గతంలో పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. అయితే విచారణ వరకే సరిపెట్టుకున్న పోలీసు శాఖ ఆ తరువాత ఎలాంటి విషయాలను బయటపెట్టలేదు. వీరిలో కొందరు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నారని తేల్చింది.

మొన్నటికి మొన్న ఫుడ్ అండ్ పింక్ పబ్ పై దాడి చేయడంతో కొందరు సెలబ్రెటీలు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. అయితే వారు డ్రగ్స్ వాడుతున్నారని నిర్దారణ కాకపోయినా ఆ పబ్ లో మాత్రం వినియోగిస్తున్నారని పోలీసులు తెలిపారు. కొన్ని రోజుల తరువాత ఈ విషయం కనుమరుగవుతుండగా..మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది.

తాజాగా ఓ సినీ అసిస్టెంట్ డైరెక్టర్ గంజాయితో పట్టుబడ్డాడు. ఏకంగా 190 కిలోల గంజాయిని పట్టుకెళ్తుండగా పోలీసులకు దొరికిపోయాడు. అంతేకాకుండా ఆయన కొందరు సినీ సెలబ్రెటీలకు దీనిని సరఫరా చేస్తున్నానని వాంగ్మూలం ఇవ్వడం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

గతంలో రవితేజ సోదరుడు యాక్సిడెంట్ తో మరణించారు. దీంతో పోలీసులు విచారణ జరపడంతో డ్రగ్స్ వ్యవహారం బయటకొచ్చింది. దీంతో ఇండస్ట్రీలోని ప్రముఖులనంతా కొన్ని రోజుల పాటు విచారణ చేశారు. విచారణ హడావుడి చేసిన ఎక్సైజ్ శాఖ ఆ తరువాత ఎవరూ డ్రగ్స్ వినియోగించలేదని తేల్చింది. ఒకరిద్దరుసాధారణ వ్యక్తులను అరెస్టు చేసింది. రీసెంట్ గా ఓ పబ్ పై దాడి చేసిన ఎక్సైజ్ శాఖ సినీ రంగానికి చెందిన రాహుల్ సిప్లిగంగజ్, నిహారిక వంటి వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే వారెవరూ డ్రగ్స్ వినియోగించలేదని తేల్చారు. కానీ ఈ పబ్ లో డ్రగ్స్ ఉపయోగిస్తారని చెప్పారు.

తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ హథీరాం అనే వ్యక్తి పోలీసులకు గంజాయితో పట్టుబడ్డాడు. ఏకంగా 190 కిలోల గంజాయిని సరఫరా చేస్తూ పోలీసులకు దొరికపోయాడు. యుద్ధం శరణం, కురుక్షేత్రం వంటి సినిమాలకు పనిచేసిన హథీరాం పోలీసుకు సంచలన విషయాలను చెప్పాడు. తాను కొందరు సినీ ఆర్టిస్టులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఓ వైపు సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూనే.. మరోవైపు ఈ బిజినెస్ చేస్తున్నాడని పోలీసులు అంటున్నారు.

అయితే డ్రగ్స్ కు ప్రత్యామ్నాయంగా గంజాయిని వినియోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హథీరాం ఈ గంజాయిని కర్ణాటక నుంచి తీసుకువస్తున్నట్లు తెలిపారు. అయితే వీరికి ఎవరు సరఫరా చేస్తున్నారు..? ఎక్కడి నుంచి వస్తుంది..? అనే విషయాలను పోలీసులు విచారణలో తేల్చనున్నారు. ఏకంగా 190 కిలోల గంజాయిని టాలీవుడ్ ఇండస్ట్రీకి సరఫరా చేస్తున్నానని హథారం చెప్పడం మరోసారి సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది.