Begin typing your search above and press return to search.

మానేస్తున్న ప్రభాస్ హీరోయిన్

By:  Tupaki Desk   |   16 Nov 2017 4:31 AM GMT
మానేస్తున్న ప్రభాస్ హీరోయిన్
X
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ సినిమాలంటే జనాల్లో బోలెడంత ఆసక్తి ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి రీసెంట్ టైం వరకూ వరుసగా ఈమె నటించిన సినిమాలు సక్సెస్ కాగా.. ఈ ఏడాది మాత్రం అంతగా అచ్చి రాలేదు. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సాహో చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది శ్రద్ధ. తెలుగు.. హిందీతో పాటు దేశవ్యాప్తంగా పలు భాషల్లో భారీ రిలీజ్ కు సిద్ధం అవుతున్న సాహో చిత్రంలో.. తన అందాలతో అలరించనుంది ఈ భామ.

ఇప్పుడీ బ్యూటీ ఓ కీలకమైన నిర్ణయం తీసేసుకున్నట్లు చెబుతోంది. సహజంగా నాన్-వెజ్ ను బాగానే ఇష్టపడే శ్రద్ధా కపూర్.. ఇకపై మాంసాహారం తినకుండా ఉండేందుకు ప్రయత్నిస్తానని చెబుతోంది. 2018 నుంచి నాన్ వెజ్ మానేసేందుకు ప్రయత్నిస్తానని.. సోషల్ మీడియా ద్వారా చెప్పి పెద్ద షాక్ నే ఇచ్చింది శ్రద్ధ. ఈమెలో ఇంత మార్పు వచ్చేయడానికి కారణం.. పెటా సంస్థ. కొన్ని వారాల క్రితం ప్రభాస్ తో కలిసి.. హైద్రాబాదీ-ఆంధ్రా స్టైల్ నాన్ వెజ్ వంటకాలను తెగ రుచి చూసినట్లుగా ఫోటోలను పోస్ట్ చేసింది శ్రద్ధ.

ప్రభాస్ ఇచ్చిన లంచ్ లో.. బిర్యానీ నుంచి రకరకాల నాన్ వెజ్ వంటకాలను టేస్ట్ చేసినట్లుగా చెప్పింది శ్రద్ధా కపూర్. ఆ తర్వాత పెటా సంస్థ నుంచి వెజిటేరియన్ లోనే నాన్ వెజ్ కు ధీటుగా ఉండే వంటకాల రెసిపీలతో పెటా సంస్థ ఓ పుస్తకాన్ని ఈమెకు పంపిందట. దీంతోపాటే జంతు సంరక్షణపై క్లాసులు కూడా ఉంటాయనే సంగతి తెలిసిందే. అన్నిటిపై తెగ థింక్ చేసేసిన శ్రద్ధా కపూర్.. వచ్చే ఏడాది నుంచి మాంసాహారం మానేయాలని ఫిక్స్ అయిపోయింది.