Begin typing your search above and press return to search.

సౌంద‌ర్య‌లో ఎన్న‌టికీ త‌ర‌గ‌ని నిధులు అవే

By:  Tupaki Desk   |   12 July 2022 7:00 AM IST
సౌంద‌ర్య‌లో ఎన్న‌టికీ త‌ర‌గ‌ని నిధులు అవే
X
రాంచీ డైరీస్- ర‌క్తాంచ‌ల్ వెబ్ సిరీస్ ల‌తో పాపులరైన‌ బ్యూటీ సౌంద‌ర్య శ‌ర్మ‌. దిల్లీ టు గ‌ల్లీ ఈ భామ‌కు భారీ ఫాలోయింగ్ పెరిగింది అంటే ఆ రెండు సిరీస్ లు కార‌ణం. న‌టిగా మ‌రో లెవ‌ల్ చూపించిన ఈ బ్యూటీ నిజానికి యాక్ట‌ర్ కాబోయి డాక్ట‌ర్ అయిన త‌న మామ్ ఇచ్చిన స్ఫూర్తితో సినీరంగంలో అడుగుపెట్టింది. ఇక ఇటీవ‌లి కాలంలో బాలీవుడ్ లో బిగ్ రేంజ్ చూపించేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది.

పంతం ప‌ట్టుద‌ల‌తో ఎంత దూరం అయినా వెళ్లేందుకు సౌంద‌ర్య శ‌ర్మ వెన‌కాడ‌దు. పోటీ ప్ర‌పంచంలో త‌న‌ని తాను ఆవిష్క‌రించుకునేందుకు వైవిధ్య‌మైన ప్లాన్ తో దూసుకెళుతోంది. అనుపమ్ ఖేర్ నిర్మించిన రాంచీ డైరీస్ తో తెర‌కు పరిచ‌య‌మైన సౌందర్య శ‌ర్మ న‌టిగా త‌న‌ పాత్రను పోషించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత రక్తాంచల్ రెండు భాగాల్లో న‌టించింది. ఢిల్లీకి చెందిన సౌందర్య డెంటల్ స్టడీస్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. బ్రాహ్మ‌ణ యువ‌తి అయినా కానీ రంగుల‌ కలలతో ముంబైకి వచ్చి ప్రస్తుతం వాటిని నెరవేర్చుకుంటోంది.

ప్ర‌స్తుతం నాలుగు ప్రాజెక్ట్ లతో ఈ బ్యూటీ బిజీగా ఉంది. OTTలో మూడు సిరీస్ లు చేస్తోంది. అలాగే ఒక భారీ సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉంది. సౌంద‌ర్య‌కు సోష‌ల్ మీడియాల్లోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ టాప్ చినుగుల బ్లూ డెనిమ్ లో దుమారం రేపింది. మ‌త్తు క‌ళ్ల‌తో చిత్తు చేస్తూ నాభి సొగ‌సును ఆవిష్క‌స్తున్న ఈ బ్యూటీ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.