Begin typing your search above and press return to search.

శ్రీశాంత్‌ భార్యకు కోపం వచ్చింది

By:  Tupaki Desk   |   27 Nov 2018 12:33 PM GMT
శ్రీశాంత్‌ భార్యకు కోపం వచ్చింది
X
స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో బీసీసీఐ నిషేదంకు గురైన శ్రీశాంత్‌ తాజాగా హిందీ బిగ్‌ బాస్‌ సీజన్‌ 12 లో పాల్గొన్న విషయం తెల్సిందే. శ్రీశాంత్‌ కారణంగా ఈసారి బిగ్‌ బాస్‌ బాగా ప్రేక్షకాధరణ దక్కించుకుంటోంది. ప్రతి ఎపిసోడ్‌ లో శ్రీశాంత్‌ ఏదో ఒక వివాదాన్ని రాజేస్తూ - సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌ గా నిలుస్తున్నాడు. ఎక్కువగా తనపై వచ్చిన ఫిక్సింగ్‌ ఆరోపణల సమయంలో తాను పడ్డ మానసిక వేదన గురించి పదే పదే చెబుతూ వస్తున్నాడు.

తాజాగా కూడా శ్రీశాంత్‌ తనపై వచ్చిన ఫిక్సింగ్‌ ఆరోపణలపై స్పందిస్తూ.. ఆ సమయంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. చనిపోవాలనిపించింది - నా తండ్రిని కూడా స్టేడియం వైపుకు వెళ్లకుండా చూశారు. క్రికెట్‌ బాల్‌ పట్టుకోకుండా చేయాలని కొందరు చూశారు. అయితే నా వెంట న్యాయం ఉండటంతో కోర్టు నన్ను నిర్ధోషిగా తేల్చింది. కాని బిసిసిఐ మాత్రం నన్ను ఇంకా దోషిగానే చూస్తుందని ఆవేదన వ్యక్తం చేసి - కన్నీరు పెట్టుకున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. శ్రీశాంత్‌ ఎమోషన్‌ అవ్వడం చాలా మంది గుండె పిండేసింది.

శ్రీశాంత్‌ వీడియోకు రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు యజమాని రాజ్‌ కుంద్రా ఫన్నీ ఈమోజీతో తన కామెంట్‌ ను పెట్టాడు. శ్రీశాంత్‌ ఎమోషన్‌ వీడియోకు రాజ్‌ కుంద్రా ఫన్నీ ఈమోజీ పోస్ట్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోంది. శ్రీశాంత్‌ అభిమానులు రాజ్‌ కుంద్రా కామెంట్‌ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇక శ్రీశాంత్‌ భార్య భువనేశ్వరి కుమారి కూడా రాజ్‌ కుంద్రా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీశాంత్‌ పై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని కోర్టు తేల్చింది. ఆ విషయం రాజ్‌ కుంద్రాకు తెలియదేమో అంటూ కామెంట్‌ చేసింది. తన భర్త గురించి బెట్టింగ్‌ లకు పాల్పడే వ్యక్తి కామెంట్‌ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్‌ కుంద్రా అప్పట్లో బెట్టింగ్‌ కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెల్సిందే. మొత్తానికి తన భర్త శ్రీశాంత్‌ ఎమోషన్‌ ను ఫన్నీగా తీసుకున్నందుకు రాజ్‌ కుంద్రాకు చాలా సీరియస్‌ గా భువనేశ్వరి సమాధానం ఇచ్చింది.