Begin typing your search above and press return to search.

19 ఏళ్ల త‌ర్వాత మ‌ల‌యాళంలో రీఎంట్రీ!

By:  Tupaki Desk   |   10 Nov 2015 7:30 AM GMT
19 ఏళ్ల త‌ర్వాత మ‌ల‌యాళంలో రీఎంట్రీ!
X
ఇటీవ‌లి కాలంలో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి గురించి టాలీవుడ్‌ లో ఇంట్రెస్టింగ్ డిబేట్ సాగింది. ఈ అమ్మ‌డు తెలుగు సినిమాలు వ‌దిలేసి, త‌మిళానికే ప్రాధాన్య‌త‌నివ్వ‌డం పెద్ద రేంజులో చ‌ర్చ‌కొచ్చింది. ఓ తెలుగు సినిమా చేసేందుకు శ్రీ‌దేవి సిద్ధంగా లేదు ఇప్ప‌టికీ. అయితే మ‌ల‌యాళీల‌కు మాత్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసి మ‌రోసారి మ‌న మేక‌ర్స్‌కి షాకిచ్చింది.

శ్రీ‌దేవి ఇంగ్లీష్ వింగ్లీష్‌ తో రీఎంట్రీ ఇచ్చాక .. ఆచితూచి అడుగులు వేస్తోంది. బాహుబ‌లి చిత్రంలో రాజ‌మాత క్యారెక్ట‌ర్‌ ని కాద‌నుకున్న శ్రీ‌దేవి త‌మిళంలో పులి చిత్రంలో న‌టించింది. ఈ సినిమా డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్‌ నిచ్చి నిరాశ‌ప‌రిచింది. అందుకే ఇప్పుడు ఏ ముఖంతో తెలుగు ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టాలి? అన్న‌ది అర్థం కాక .. మ‌ల‌యాళం వైపు దృష్టి సారించింద‌ని అనుకుంటున్నారు.

మ‌ల్లూ వుడ్‌ లో ఎం.డి.రాజేంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకి సంత‌కం చేశారు శ్రీ‌దేవి. దాదాపు 19 సంవ‌త్స‌రాల త‌ర్వాత అక్క‌డ రీఎంట్రీ ఇస్తున్నారు. 1969లో రిలీజైన కుమార సంభ‌వం మ‌ల్లూ వుడ్ లో శ్రీ‌దేవి న‌టించిన మొద‌టి సినిమా. 1996లో రిలీజైన దేవ‌రాగం చివ‌రి సినిమా. ఇన్నాళ్లికి మ‌ల్లీ రీఎంట్రీ అక్క‌డ‌. ఇది మ‌ల‌యాళీల‌కు కాస్త షాకింగ్ న్యూసే, సేమ్ టైమ్ ఎంతో స‌ర్‌ ప్రైజింగ్ న్యూస్ అని చెప్పుకుంటున్నారు. అదీ మ్యాట‌రు.