Begin typing your search above and press return to search.

SSMB ఫ్యాన్స్ ఏం చెప్పినా విన‌రు!?

By:  Tupaki Desk   |   18 April 2022 3:14 AM GMT
SSMB ఫ్యాన్స్ ఏం చెప్పినా విన‌రు!?
X
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఒక సినిమా త‌ర్వాత ఒక‌టి చేస్తూ నెమ్మ‌దిగా అడుగులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇత‌ర హీరోల‌తో పోలిస్తే మ‌రీ అంత‌గా హైరానా ప‌డ‌డం లేదు. ఒకేసారి మూడు నాలుగు సెట్స్ కి ప‌రుగులు పెట్ట‌డం లేదు. షెడ్యూళ్ల ప‌రంగా సూప‌ర్ కృష్ణ‌కు పూర్తి ఆపోజిట్ గా ఉన్నార‌ని చెప్పాలి. ఇక త‌న వెంట షాడో న‌మ్ర‌త మాత్రం స్క్రిప్టులు వింటూ త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. త‌దుప‌రి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో పాన్ ఇండియా సినిమా కోసం మ‌హేష్ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఈలోగానే అత‌డు న‌టించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట' 12 మే 2022న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

స‌ర్కార్ వారి ప్ర‌మోష‌న్స్ స్వింగ్ లోనే ఉన్నాయి. రెండు హిట్ పాటలను విడుదల చేసిన మేకర్స్ మరో క్రేజీ ట్రాక్ ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దీని గురించి బుట్ట బొమ్మా గాయకుడు ట్వీట్ చేసారు. ''నాకు సందేశం పంపే SSMB అభిమానులందరికీ సర్కారు వారి పాటలోని పాట ఎప్పుడు రిలీజ‌వుతుందో నాకు నిజంగా క్లూ లేదు. మీరందరూ వినడానికి ఎంత ఆత్రుతగా ఉన్నారో నాకు తెలుసు. నన్ను నమ్మండి.. నేను కూడా! కానీ ప్రతిదానికీ అంతర్గత ప్ర‌ణాళిక‌ అనేది ఉంటుంది. అధికారిక ప్రకటన కోసం ఓపికగా వేచి ఉండటమే మనం చేయగలిగింది'' అని అన్నారు.

ఎస్.ఎస్‌.థమన్ కంపోజ్ చేసిన ఈ డ్యూయెట్ ను త్వరలో విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్- 14 రీల్స్ ప్లస్-GMB ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయిక. బ్యాంక్ కుంభ‌కోణం నేప‌థ్యంలో ఆద్యంతం క‌మ‌ర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఎట్టి ప‌రిస్థితుల్లో హిట్టు కొట్టాల‌న్న క‌సితో మ‌హేష్ - ప‌ర‌శురామ్ బృందం ఈ మూవీ కోసం సీరియ‌స్ గా వ‌ర్క్ చేశార‌న్న‌ది తెలిసిందే. మ‌రో మూడు వారాల్లో సినిమా థియేట‌ర్ల‌లోకి రానుండ‌డంతో ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ నెల‌కొంది.

త్రివిక్ర‌మ్ తో ఎంత‌వ‌ర‌కూ..?

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు -త్రివిక్రమ్ కాంబినేష‌న్ లో SSMB28 గ్రాండ్ లాంచ్ ఇటీవ‌ల‌ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఫిల్మ్ స్టూడియోలో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. SSMB28 కి థమన్ సంగీతం అందిస్తున్నారు. త్రివిక్ర‌మ్ తో అర‌వింద స‌మేత‌.. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల‌కు ప‌ని చేసిన‌ పూజా హెగ్డే ఇప్పుడు మ‌హేష్ మూవీ లో క‌థానాయిక‌గా ఆడిపాడ‌నుంది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్ర‌మిది. ప్ర‌స్తుతం రెగ్యుల‌ర్ షూట్ మోడ్ లో ఉంది యూనిట్.

మ‌హేష్ లేకుండానే లాంచింగ్ అయ్యింది. అది ఆయ‌న సెంటిమెంట్ కూడా. ఇటీవ‌లి కాలంలో శ్రీ‌మంతుడు- భ‌ర‌త్ అనే నేను- మ‌హ‌ర్షి- స‌ర్కార్ వారి పాట .. ఇలా ఏ చిత్రం ఓపెనింగ్ చేసినా మ‌హేష్ ఈవెంట్లో క‌నిపించ‌లేదు.

ఇప్పుడు త్రివిక్ర‌మ్ తో త‌న కెరీర్ 28వ సినిమా లాంచ్ లోనూ అత‌డు క‌నిపించ‌లేదు. కానీ షూటింగుల కోసం ప‌క్కా ప్రిప‌రేష‌న్ తో మ‌హేష్ హాజ‌ర‌వుతార‌న్న‌ది అంద‌రికీ తెలిసినదే.