Begin typing your search above and press return to search.

పూరీకి హీరో దొరికాడా..?

By:  Tupaki Desk   |   19 Sep 2022 10:29 AM GMT
పూరీకి హీరో దొరికాడా..?
X
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒక‌రైన పూరీ జగ‌న్నాథ్.. ఇటీవల 'లైగర్' సినిమాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా.. పూరీ పాన్ ఇండియా ఆశలపై నీళ్లు చెల్లింది.

పూరీ ఇన్నేళ్ల సినీ కెరీర్‌ లో హిట్లు చూసాడు.. ప్లాప్స్ అందుకున్నాడు కానీ.. ఇప్పుడు ఎదుర్కొంటున్నంత నెగెటివిటీ ఎప్పుడూ చూడలేదనే చెప్పాలి. 'లైగర్' బాక్సాఫీస్ వద్ద డబుల్ డిజాస్టర్ అవ్వడంతో.. దర్శకుడు తన తదుపరి సినిమాతో సాలిడ్ హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.

నిజానికి 'లైగర్' సినిమా రిలీజ్ అవ్వకముందే విజయ్ తో 'జనగణమన' (JGM) అనే చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చాడు పూరీ. అయితే ఈ ప్రాజెక్ట్ ని ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంచారని.. పూర్తిగా ఆగిపోయిందని రూమర్స్ వచ్చాయి. 'లైగ‌ర' ఫెయిల్యూర్‌ తోనే పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారని అనుకున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

'లైగర్' సినిమా కోసం గత మూడేళ్ళుగా ముంబైలోనే మకాం వేసిన పూరీ జగన్నాథ్.. ఇటీవల ముంబైలోని విలాసవంతమైన తన ఆఫీస్ స్థలాన్ని ఖాళీ చేసి హైదరాబాద్ కు వచ్చినట్లు టాక్ నడిచింది. అయితే ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గోవా కి షిఫ్ట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నాడనే టాక్ నడుస్తోంది.

పూరి జగన్నాధ్ తదుపరి సినిమాపై స్పష్టత ఇవ్వడానికంటే ముందు తన స్థావరాన్ని గోవాకు మారుస్తాడాని.. అక్కడే తన రాబోయే స్క్రిప్ట్‌ లపై పని చేస్తాడని అనుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ బీచ్ ఫేసింగ్ లో ఇల్లు చూస్తున్నారని చెబుతున్నారు.

ఇకపోతే టాలీవుడ్ స్టార్స్ అందరూ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నందున.. 'లైగర్' వంటి ప్లాప్ తర్వాత పూరీ నెక్స్ట్ చిత్రాన్ని ఎవరితో చేసాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో నటసింహం నందమూరి బాలకృష్ణ తో డాషింగ్ డైరెక్టర్ సినిమా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి.

పూరీ జగన్నాథ్ మరియు బాలయ్య కాంబినేషన్లో గతంలో 'పైసా వసూల్' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంత వసూలు చేసిందనేది పక్కన పెడితే.. బాలకృష్ణ లోకి కొత్త కోణాన్ని బయటకు తీసిందని చెప్పాలి. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి వర్క్ చేయనున్నారని అంటున్నారు.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సినిమా చేస్తున్న బాలయ్య.. దీని తర్వాత ఓ పక్కా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలవనున్నారు. ఇదే క్రమంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సీనియర్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వచ్చింది.

నిజానికి 'పైసా వసూల్' టైంలోనే పూరీ తో మరో సినిమా చేయడానికి బాలయ్య కమిట్ అయ్యారట. అయితే విజయ్ దేవరకొండ సినిమా హోల్డ్ లో పడటంతో.. పూరీ ఇప్పుడు నటసింహం కోసం స్క్రిప్ట్ రెడీ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.