Begin typing your search above and press return to search.

నమాజ్ సౌండ్ కారణంగా నటి హర్టయ్యింది

By:  Tupaki Desk   |   25 July 2017 1:29 PM GMT
నమాజ్ సౌండ్ కారణంగా నటి హర్టయ్యింది
X
కొంత కాలం కిందట సోనూ నిగమ్ మసీదులో పొద్దునే వినిపించే నమాజ్ తాలూకు అజాన్ పై చేసిన ట్వీట్ ఎంతటి దుమారం లేపిందో మన అందరికి తెలిసిందే. ఆ కారణంగా సోనూ ఎన్నడూ రాన్నంతగా వార్తలు లోకి వచ్చి నానా గోల చేశాడు. ఇప్పుడు కూడా మరో మాజీ బాలీవుడ్ నటి సుచిత్ర కృష్ణమూర్తి కూడా అజాన్ పై ట్వీట్ చేసి మరో వివాదానికి దారి తీసింది. కొన్ని వారాలు కిందట సోనూ నిగమ్ ట్వీట్ చేసిన ప్రాంతం దగ్గరలోనే సుచిత్ర కూడా ట్వీట్ చేయడం కొసమెరుపు ఇక్కడ.

సుచిత్ర తన ట్వీట్ ద్వారా ఏమి అన్నది అంటే “నేను ఇంటికి పొద్దున్న అంటే 4.45 నిమాషాలుకు వచ్చాను. అంత పొద్దున్నే నాకు నా చెవులో ఉండే కర్ణబేరి పగిలిపోయే లా రెండు శబ్ధలు వచ్చాయి పక్కనే ఉన్న మసీదు నుండి. ఇలా అనవసరంగా ఎక్కువ సౌండ్ పెట్టి ఎందుకు రాద్దాంతం చేస్తారో అర్ధం కాదు” అని ట్వీట్ చేసింది. సోనూ నిగమ్ ట్వీట్కు వచ్చిన స్పందన మాదిరినే సుచిత్ర కృష్ణమూర్తికి కూడా విమర్శల తాకిడి గట్టిగానే పడుతుంది. అయితే కొంతమంది ఆమెను సపోర్ట్ కూడా చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఈమె పై సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ తీవ్ర విమర్శలు చేశాడు. “అర్ధ రాత్రులు వరకు తాగుతూ పార్టీలు చేసుకొంటు పెద్ద పెద్ద శబ్ధలు మధ్య గంతు వేస్తూ తెలియని మగాళ్లు తో తిరుగుతూ ఉండే లేడి.. సంస్కృతి పైన దేశ ఆచారాలు పైన మాట్లాడటం వింతగా ఉంది“ అని ఘాటుగా స్పందించాడు ఆమె ట్వీట్ కి. దానికి సుచిత్ర కృష్ణమూర్తి కూడా పద్దతిగానే సమాధానపరిచింది చూడండి “బాబు నేను ఎక్కడ అజాన్ ఆచారం పైన మతం పైన కామెంట్ చేయలేదు. అక్కడ ఉన్న అనవసర శబ్దాన్ని గురించి మాత్రమే మాట్లాడను. మీరు కూడా కొంచం పద్దతిగా కామెంట్ చేస్తే మీ హోదా కి మీరు విలువ ఇచ్చిన వారు అవుతారు'' అని చెప్పింది.

సుచిత్ర కృష్ణమూర్తి ఆ తరువాత కూడా ఇండియా లోనే అజాన్ ఇంత గట్టిగా సౌండ్ పెట్టి చేస్తారు మిగతా ఇస్లామిక్ దేశాలులో కూడా ఇంతలా చేయరు అని పేర్కొంది. ఇప్పుడు ఈమె ట్వీట్ సోషల్ మీడియా లో మరో మత చర్చకు దారి తీసేలా ఉంది.