Begin typing your search above and press return to search.

కొడుకు కోసం ఆ బడా నిర్మాత భారీ రిస్క్ చేస్తాడా..?

By:  Tupaki Desk   |   22 April 2020 1:30 AM GMT
కొడుకు కోసం ఆ బడా నిర్మాత భారీ రిస్క్ చేస్తాడా..?
X
భల్లాల దేవుడు దగ్గుపాటి రానా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో దర్శకుడు ప్రభుసోల్మన్ రూపొందించిన ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామా 'అరణ్య'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఏకంగా 5 భాషల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు వేణు ఊడుగులతో కలిసి 'విరాటపర్వం' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసింది చిత్రయూనిట్. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో రానా 'హిరణ్యకశ్యప' అనే సినిమా ఓకే చేసిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా షూటింగ్ సమ్మర్ లో ప్రారంభిద్దాం అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఎక్కడి సినిమాలు అక్కడే, ఎక్కడి జనాలు అక్కడే నిలిచిపోయారు.

ఇక ‘రుద్రమదేవి’ సినిమా తర్వాత ‘హిరణ్య కశ్యప’ సినిమాను ప్రకటించాడు డైరెక్టర్ గుణశేఖర్. దగ్గుపాటి రానా హిరణ్యకశ్యకుడిగా నటించబోతున్నాడని కూడా ప్రకటించాడు. రానా ఎప్పటి నుండో కోరుకుంటున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు రూ.180 కోట్ల భారీ బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. రేపో మాపో ఈ మూవీ ప్రారంభమవుతుందని గుణశేఖర్ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న తరుణంలో కరోనా సంక్షోభం వచ్చింది. ఇప్పుడు రానా మూవీ పై అంత భారీ బడ్జెట్ పెట్టడం పెద్ద రిస్క్. అదీగాక గుణశేఖర్-రానా కాంబినేషన్ పై డిస్టిబ్యూటర్లు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చని మాట్లాడుకుంటున్నారు. అందుకే నిర్మాత సురేశ్ బాబు ఆలోచనల్లో పడ్డట్లు సమాచారం. అందుకే ప్రస్తుతానికి హిరణ్యకశ్యకుడిని పక్కన పెడదాం అనే అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి దీనిపై ఎవరైనా స్పందిస్తారేమో..!