Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా అప్టేడ్ తో తార‌క్ బ‌ర్త్ డే ట్రీట్!

By:  Tupaki Desk   |   11 May 2022 3:30 PM GMT
పాన్ ఇండియా అప్టేడ్ తో తార‌క్ బ‌ర్త్ డే ట్రీట్!
X
'ఆర్ ఆర్ ఆర్' స‌క్సెస్ తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. తొలి పాన్ ఇండియా సినిమా పెద్ద స‌క్సెస్ అవ్వ‌డంతో తార‌క్ ఆనందానికి అవ‌ధుల్లేవ్. మూడేళ్ల పాటు మ‌రో సినిమా చేయ‌కుండా ఒకే సినిమాపై ఎఫెర్ట్ అంతా పెట్టి చేసిన‌ సినిమాకి అంచ‌నాల్ని మించిన ఫ‌లితం ద‌క్కింది. దీంతో త‌దుప‌రి ప్రాజెక్ట్ ల విషయంలో అంతే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఇప్ప‌టికే త‌న ల్యాండ్ మార్క్ మూవీ 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. జూన్ లేదా జులై లో సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంద‌ని..అన్ని ప‌నులు పూర్తిచేసి వ‌చ్చే ఏడాది ఆరంభంలో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తార‌ని ప్రచారం సాగుతుంది. అలాగే ప్ర‌శాంత్ నీలో తో పాన్ ఇండియా సినిమా విషయంలో కొంత స్త‌బ్ధ‌త ఏర్ప‌డింది.

మ‌రి ఇప్పుడు వాట‌న్నింటిపై ఫుల్ క్లారిటీ వ‌చ్చేసే స‌మ‌యం ఆస‌న్న‌మైదా? యంగ్ టైగ‌ర్ ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నారా? అందుకు ఇంకా వారం రోజులే స‌మ‌యం ఉందా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తుంది. మే 20 జూన‌యిర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ రోజున అభిమానులకు తార‌క్ డ‌బుల్ ట్రీట్ ప్లాన్ చేసిన‌ట్లు గుస గుస వినిపిస్తుంది.

మే 20వ తేదిన కొర‌టాల సినిమా ప్రారంభోత్స‌వం జ‌రుగుతుంద‌ని స‌మాచారం. అలాగే అదే రోజున ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్ట్ విష‌యంలోనూ ఫుల్ క్టారిటి వ‌స్తుంద‌ని వినిపిస్తుంది. ఎన్టీఆర్ 31వ సినిమా ప్ర‌శాంత్ తోనే కాబ‌ట్టి ప్రత్యేకంగా ఓపోస్ట‌ర్ రిలీజ్ చేసి మరికొన్ని అప్ డేట్స్ ఇవ్వ‌డానికి స‌మాయ‌త్తం అవుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది.

మ‌రి ఈ రెండు క‌థ‌నాల్లో నిజ‌మెంత‌? అన్న‌ది ఖ‌రారు కావాల్సి ఉంది. అలాగే తార‌క్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా వెకేష‌న్ వెళ్లే అవ‌కాశం ఉంద‌ని మ‌రో ప్ర‌చారం. కోవిడ్ మొద‌లైన త‌ర్వాత కుటుంబమంతా స‌రదాగా బ‌య‌ట స‌మాయాన్ని గ‌డ‌లేక‌పోయారు. సిటీకే ప‌రిమితమ‌వ్వాల్సి వ‌చ్చింది. అప్పుడ‌ప్పుడు స్నేహితులుతో గెట్ టూ గెద‌ర్ పార్టీలు త‌ప్ప ఇత‌ర యాక్టివిటీస్ ఏం చేయ‌లేదు. దీంతో కొన్ని రోజుల పాటు వెకేష‌న్ మోడ్ లోకి వెళ్లిపోవాల‌న్న‌ది తారక్ ప్లాన్ గా ఉందిట‌.

ఇక ప్ర‌శాంత్ నీల్ 'కేజీఎఫ్ -2' తో మ‌రో పాన్ ఇండియా స‌క్సెస్ ని ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇదే ఊపులో యంగ్ టైగ‌ర్ తో సినిమా ప్ర‌క‌టించ‌డంతో అంచ‌నాలు పీక్స్ కి చేరిపోతున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీలో ప్ర‌భాస్ తో 'స‌లార్' చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసి వ‌చ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. ఆ త‌ర్వాత తార‌క్ సినిమా మొద‌ల‌య్యేది అన్న‌ది గ్ర‌హించాలి.