Begin typing your search above and press return to search.

తార‌క్ ల్యాండ్ మార్క్ పై #ఎస్ ఎస్ ఎంబీ 28 ఎఫెక్ట్

By:  Tupaki Desk   |   20 Aug 2022 6:37 AM GMT
తార‌క్ ల్యాండ్ మార్క్ పై #ఎస్ ఎస్ ఎంబీ 28 ఎఫెక్ట్
X
#ఎస్ ఎస్ ఎంబీ 28వ చిత్రం అనౌన్స్ మెంట్ తో మ‌హేష్ అభిమానుల్లో జోష్ నింపారు త్రివిక్ర‌మ్. చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న రావ‌డంతో మ‌హేష్ ఫ్యాన్స్ లో ఒక్క‌సారిగా ఆనందం ఉర‌క‌లేయ‌డం మొద‌లైంది. ప్రాజెక్ట్ డిలే అవుతుందని నిరుత్స‌హంలో ఉన్న అభిమానుల‌కు ఏకంగా రిలీజ్ తేదీతో బిగ్ ట్రీట్ ఇచ్చారు.

దీంతో ఒక్క‌సారిగా అన్నిర‌కాళ‌ అసంతృప్తులు మ‌న‌సులో నుంచి తొల‌గిపోయాయి. సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఎప్పుడు పూర్తి చేస్తారు? అన్న‌ది అభిమానుల‌కు అన‌వ‌సరం. చెప్పిన తేదీకి వ‌చ్చామా? లేదా? అన్న‌దే టాపిక్ అన్నంత‌గా? అభిమానుల నోళ్ల‌కు మాట‌ల మాంత్రికుడు తాళం వేసాడు. కాబ‌ట్ట ప్ర‌స్తుతానికి ఎస్ ఎస్ ఎంబీ టాపిక్ అన‌వ‌స‌ర‌మైన‌ది.

అయితే ఈ అనౌన్స్ మెంట్ చూసి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు మంటెక్కిపోతున్న‌ట్లు తెలుస్తోంది. తార‌క్ ల్యాండ్ మార్క్ మూవీ 30వ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఎగ్టైట్ మెంట్ తో వెయిట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న చిత్రం ఇప్ప‌టికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

జూన్ లో ప్రారంభం కావాల్సిన సినిమా ఇంత వ‌ర‌కూ సెట్స్ కి వెళ్లింది లేదు.ఈ క్ర‌మంలో తార‌క్ అభిమానులు అస‌హ‌నాన్ని సైతం వ్య‌క్తం చేసారు. నెట్టింట పెద్ద ఎత్తున హీరోని ట్రోల్ చేసారు. అల‌సిపోయిన అభిమానులు సైతం కొన్ని రోజులుగా కామ్ గానే ఉన్నారు. అయితే మ‌ళ్లీ ఇప్పుడు మ‌హేష్ కార‌ణంగా ర‌చ్చ మొద‌టికి వ‌చ్చింది.

మ‌హేష్ అనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది. మీదెప్పుడు? బాస్ అంటూ మ‌ళ్లీ కామెంట్లు షురూ చేసారు. సినిమా అప్ డేట్స్ రివీల్ చేయాల‌ని...వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ ప్రారంభించి రిలీజ్ చేయాల‌ని..వాటి తాలుకా అప్ డేట్స్ ఇవ్వాలంటూ తార‌క్..

కొర‌టాల‌పైస‌ నెట్టింట సాక్షిగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. రేపోమాపో మ‌హేష్ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. అది జ‌రిగితే తార‌క్ అభిమానులు మ‌రింత చెల‌రేగుతారు.