Begin typing your search above and press return to search.

దాన్నుంచి బయటపడటానికి తాగుడుకు అలవాటు పడిపోయా: తేజస్వి

By:  Tupaki Desk   |   27 Aug 2022 10:30 AM GMT
దాన్నుంచి బయటపడటానికి తాగుడుకు అలవాటు పడిపోయా: తేజస్వి
X
'బిగ్ బాస్' సీజన్-2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న తెలుగమ్మాయి తేజస్వి మదివాడ.. హౌస్ నుంచి బయటకు వచ్చే సమయానికి ఫుల్ నెగిటివిటీని కూడగట్టుకుంది. తోటి కంటెస్టెంట్, సీజన్ విన్నర్ కౌశల్ మందా తో ఆమెకు జరిగిన గొడవలతో దారుణంగా ట్రోల్ చేయబడింది. అయితే కౌశల్ ఆర్మీ కారణంగా దేశం వదిలి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని.. దాన్నుంచి బయట పడటానికి తాగడం కూడా అలవాటు చేసుకున్నట్లు తేజస్వి తెలిపింది.

బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన తేజస్వి.. 'కమిట్‌మెంట్' అనే చిత్రంలో నటించింది. చాలా కాలంగా లేట్ అవుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈ బ్యూటీ.. తను సినిమాలకు దూరం అవ్వడానికి కౌశల్ ఆర్మీ కారణమనే విధంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

''బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నెగెటివిటీని చూసి దిమ్మ తిరిగిపోయింది. సినిమాలన్నీ ఒక ఎత్తైతే బిగ్ బాస్ - ఆ కౌశల్ మండా - ఆర్మీ అనేది డిఫెండర్ లెవల్ ఆఫ్ ఎటాక్ అని నేను ఫీల్ అయ్యాను. ఒక అమ్మాయిని డర్టీ డర్టీ మీమ్స్ తో అంతలా ఎందుకు ఎటాక్ చేస్తున్నారు. దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. వాడెవడో లైఫ్ లో ముందుకు వెళ్లాడానికి చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు. అతను ఎక్కడా కనిపించడం లేదు. కానీ అది జరిగినప్పుడు నేను ఎంత డిప్రెస్ అయ్యానంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయాలని డిసైడ్ అయ్యాను'' అని తేజస్వి చెప్పింది.

''రెండున్నరేళ్లు ఇండియాలో లేకుండా బయట తిరుగుతూ ఉన్నాను. బిగ్ బాస్ నుంచి నేను చాలా హ్యాపీగానే బయటకు వచ్చా. ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్లు నా ఫ్రెండ్స్ అంతా నన్ను పట్టుకొని ఏడ్చారు. ఏంటా అని చూస్తే నా మీద రకరకాల మీమ్స్ - బూతులు - మురికివాడ అంటూ హద్దూ అదుపు లేకుండా కామెంట్స్ చేస్తున్నారు. దానికి తోడు హౌస్ లోపల నా నోటికి హద్దూ అదుపు లేదని నాని నన్ను తిట్టడం. నేను నాని మరియు బిగ్ బాస్ షోతో చాలా చిరాకుపడ్డాను'' అని తెలిపింది.

హౌస్ నుండి వచ్చిన తర్వాత కౌశల్ ఆర్మీ కారణంగా తన వ్యక్తిగత మరియు వృత్తి జీవితంపై నియంత్రణ కోల్పోయానని తేజస్వి పేర్కొంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల డిప్రెషన్‌ కు గురయ్యానని.. తాగుడుకు అలవాటు పడిపోయానని తెలిపింది. దీని కారణంగానే 'కమిట్ మెంట్' సినిమాలో తన లుక్ బాగా లేదని పేర్కొంది.

''అసలు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోనే పని చేయకూడదని డిసైడ్ అయిన తర్వాత 'కమిట్ మెంట్' అనే స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చి మళ్లీ నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది. ఇది నాకు రీఎంట్రీ. 'కమిట్మెంట్' లో నా లుక్ అంతగా బాగుండదు. నా బాడీ షేప్ కూడా ఏమంత బాగాలేదు. ఫుల్ గా తాగేసి చాలా లావైపోయాను. ఆ బాధలను తీర్చుకోడానికి ఆ టైంలో అలా తీర్చుకున్నా'' అని తేజస్వి చెప్పింది.

అయితే ఎవడో ఏదో అన్నాడని నేను ఎందుకు సినిమాలు మానెయ్యాలి అని 'కమిట్ మెంట్' సినిమాలో నటించాను. మళ్లీ సినిమాలు - వెబ్ సిరీస్ లు చేయడం స్టార్ట్ చేసాను అని తేజస్వి మదివాడ చెప్పుకొచ్చింది.