Begin typing your search above and press return to search.

తెలుగు సినిమా తారకరత్నం.. అమిత్‌ షా ట్వీట్‌

By:  Tupaki Desk   |   22 Aug 2022 4:18 AM GMT
తెలుగు సినిమా తారకరత్నం.. అమిత్‌ షా ట్వీట్‌
X
తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిగా చర్చించుకున్న బీజేపీ జాతీయ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా మరియు యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ యొక్క భేటీ చాలా సింపుల్ గా జరిగిందని సమాచారం అందుతోంది. రాజకీయాల గురించి చర్చ జరగలేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఎన్టీఆర్‌ నటన ను గురించి ప్రశంసిస్తూ అమిత్ షా భేటీలో మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్ తో భేటీ విషయమై నలుగురు నాలుగు రకాలుగా చర్చించుకుంటున్న ఈ సమయంలో అమిత్‌ షా మాత్రం ఆయనతో భేటీ చాలా ఆనందంను ఇచ్చింది అంటూ ట్విట్టర్ లో తెలుగు లో ట్వీట్‌ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది అంటూ ట్వీట్‌ లో పేర్కొన్నాడు.

అమిత్‌ షా ప్రత్యేకంగా ఎన్టీఆర్‌ ని కలవడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అనేది సినిమా ఇండస్ట్రీ వారికి మరియు రాజకీయ వర్గాల వారికి అసలు అంతు పట్టడం లేదు. అయితే ఈ భేటీ వల్ల తెలంగాణ లో బీజేపీకి మైలేజ్ దక్కింది అనేది కొందరి మాట. అసలు విషయం ఏంటీ అనేది ఆ బీజేపీ అధినేతలకు తెలియాలి.

ఇక ఎన్టీఆర్ లుక్ గురించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ మధ్య బింబిసార సినిమా యొక్క ప్రీ రిలీజ్ కు హాజరు అయిన సమయం లోనే ఎన్టీఆర్ గడ్డం ను చూసి ఏంటో ఇంత గడ్డం పెంచాడు అంటూ అనుకున్నారు. ఇప్పుడు ఆ గడ్డం మరింత ఎక్కువ అయ్యింది. ఎన్టీఆర్‌ గుబురు గడ్డం తో కాస్త ఎబ్బెట్టుగా ఉన్నాడు అంటూ కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. అందుకోసం గడ్డం పెంచుతున్నాడా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు కొరటాల శివ స్క్రిప్ట్‌ వర్క్ ను పూర్తి చేయలేదు.

ఆ సినిమా కోసం ఇప్పటి నుండే గడ్డం పెంచడం ఏంటో అంటూ మరి కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి అమిత్ షా తో ఎన్టీఆర్‌ భేటీ మరియు ఆ సమయంలో ఎన్టీఆర్ గడ్డం రెండు విషయాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.