Begin typing your search above and press return to search.
సాహో మేజిక్ కంటిన్యూ అవుతుందా?
By: Tupaki Desk | 3 Sept 2019 3:50 PM ISTపండగను సరిగ్గా టార్గెట్ చేసుకుని మంచి ప్లాన్ తో రిలీజ్ అయిన టాలీవుడ్ మోస్ట్ కాస్ట్లీ మూవీ సాహో నాలుగు రోజుల వీకెండ్ ని గ్రాండ్ గా వాడుకుంది. టాక్ తో సంబంధం లేకుండా మంచినీళ్ల ప్రాయంగా 300 కోట్లు గ్రాస్ రాబట్టడం చూసి తలలు పండిన ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఇలా జరిగితే ఓకే కానీ నార్త్ నుంచి సౌత్ దాకా ఎక్కువ నెగటివ్ ప్రచారమే ఉన్న సాహో ఇంత వసూళ్లు రాబట్టడం ఆశ్చర్యమే. కానీ ఇక్కడ చాలా కారణాలు వీటికి దోహద పడ్డాయి.
సాహోకు భయపడి ఏ భాషలోనూ ఏ నిర్మాతా పోటీకి దిగలేదు. ముందు ఫిక్స్ చేసుకున్న చిచోరే లాంటి హిందీ సినిమాలు సైతం వారం వాయిదా వేసుకున్నాయి. సూర్య బందోబస్త్ ఏకంగా 20 రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఇది ప్రధానంగా వర్క్ అవుట్ అయిన అంశం. ఇక నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ మరో రీజన్. వరస సెలవులు కాబట్టి పబ్లిక్ కి సినిమా ఎంటర్ టైన్మెంట్ ఉండాల్సిందే. ఏ సెంటర్ చూసినా ప్రతి థియేటర్లోనూ దాదాపు సాహోనే ఉంటే ఇక వేరే ఛాయస్ పెట్టుకునే ఆప్షన్ ఎక్కడిది. అందుకే సాహోకు నాలుగు రోజులు తిరుగు లేకుండా పోయింది.
కానీ ఇవాళ నుంచి సీన్ మారుతుంది. వీక్ డేస్ కాబట్టి డ్రాప్ ఖాయమే. కాకపోతే అది ఏ స్థాయిలో ఉంటుందనేది చూడాలి. స్క్రీన్లు తక్కువగా ఉండే బిసి సెంటర్స్ లో ఇప్పటికే అదనపు థియేటర్లలో వేసిన సాహోని రీ ప్లేస్ చేశారని వార్తలున్నాయి. మెయిన్ స్క్రీన్ మాత్రమే కంటిన్యూ చేస్తారన్న మాట. సో ఇప్పుడీ నెగటివ్ టాక్ ఎంతమేరకు సాహోని నిలబెడుతుందో చూడాలి. పైగా ఏపిలో చాలా కేంద్రాల్లో టికెట్ ధర సెప్టెంబర్ 5 దాకా 200 రూపాయల దాకా ఉండటం క వసూళ్ల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకో వారం గడిస్తే కానీ సాహో ఏ మేరకు సేఫ్ అవుతుందో క్లారిటీ రాదు
సాహోకు భయపడి ఏ భాషలోనూ ఏ నిర్మాతా పోటీకి దిగలేదు. ముందు ఫిక్స్ చేసుకున్న చిచోరే లాంటి హిందీ సినిమాలు సైతం వారం వాయిదా వేసుకున్నాయి. సూర్య బందోబస్త్ ఏకంగా 20 రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఇది ప్రధానంగా వర్క్ అవుట్ అయిన అంశం. ఇక నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ మరో రీజన్. వరస సెలవులు కాబట్టి పబ్లిక్ కి సినిమా ఎంటర్ టైన్మెంట్ ఉండాల్సిందే. ఏ సెంటర్ చూసినా ప్రతి థియేటర్లోనూ దాదాపు సాహోనే ఉంటే ఇక వేరే ఛాయస్ పెట్టుకునే ఆప్షన్ ఎక్కడిది. అందుకే సాహోకు నాలుగు రోజులు తిరుగు లేకుండా పోయింది.
కానీ ఇవాళ నుంచి సీన్ మారుతుంది. వీక్ డేస్ కాబట్టి డ్రాప్ ఖాయమే. కాకపోతే అది ఏ స్థాయిలో ఉంటుందనేది చూడాలి. స్క్రీన్లు తక్కువగా ఉండే బిసి సెంటర్స్ లో ఇప్పటికే అదనపు థియేటర్లలో వేసిన సాహోని రీ ప్లేస్ చేశారని వార్తలున్నాయి. మెయిన్ స్క్రీన్ మాత్రమే కంటిన్యూ చేస్తారన్న మాట. సో ఇప్పుడీ నెగటివ్ టాక్ ఎంతమేరకు సాహోని నిలబెడుతుందో చూడాలి. పైగా ఏపిలో చాలా కేంద్రాల్లో టికెట్ ధర సెప్టెంబర్ 5 దాకా 200 రూపాయల దాకా ఉండటం క వసూళ్ల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకో వారం గడిస్తే కానీ సాహో ఏ మేరకు సేఫ్ అవుతుందో క్లారిటీ రాదు