Begin typing your search above and press return to search.

ఇక బాలయ్య వంతు.. థమన్ ఏం చేస్తాడో?

By:  Tupaki Desk   |   23 Nov 2022 4:33 AM GMT
ఇక బాలయ్య వంతు.. థమన్ ఏం చేస్తాడో?
X
చాలాకాలం తర్వాత మళ్లీ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద బలమైన పోటీ నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి భారీ స్థాయిలో విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అనేది ఇప్పుడు అభిమానుల్లో కూడా ఆసక్తికరంగా మారింది. అయితే పోటీ అనేది సినిమా విడుదల రోజు మాత్రమే కాకుండా విడుదల కంటే ముందు కూడా తీవ్రస్థాయిలో కొనసాగుతోంది.

ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే ఇద్దరు హీరోలు కూడా ఫాన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేశారు. అయితే ఇప్పుడు వరుసగా సాంగ్స్ విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక వాల్తేరు వీరయ్యకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా వీరసింహారెడ్డికి థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ముందుగా వాల్తేరు వీరయ్యకు సంబంధించిన బాస్ పార్టీ సాంగ్ ప్రోమో విడుదల చేయగా ఊహించని స్థాయిలో నెగిటివ్ టాక్ అందుకుంది.

అసలు దేవిశ్రీప్రసాద్ అంచనాలను అందుకోలేక పోతున్నాడు అని చాలా దారుణంగా కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు థమన్ వీరసింహారెడ్డి సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇచ్చాడు.

త్వరలోనే మొదటి సాంగ్ రాబోతుంది అని సోషల్ మీడియాలో వివరణ ఇచ్చాడు. దేవిశ్రీప్రసాద్ అయితే వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగిల్ తో తీవ్రంగా నిరాశపరిచాడు.

మరి ఇప్పుడు థమన్ ఏ విధంగా ఆకట్టుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. థమన్ అయితే ఇటీవల కాలంలో బాగానే కట్టుకుంటున్నాడు. కానీ మధ్య మధ్యలో కాపీ ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు.

ఇక ఇప్పుడు జై బాలయ్య అనే మరొక వెర్షన్ విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అఖండ తర్వాత వస్తున్న కాంబినేషన్ కాబట్టి తప్పకుండా అంచనాలను హై రేంజ్ లోనే ఉంటాయి. మరి ఆ అంచనాలను థమన్ ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.