Begin typing your search above and press return to search.

నా ప్ర‌పంచంలో భాగ‌మైనందుకు థ్యాంక్యూ

By:  Tupaki Desk   |   22 Jan 2022 12:30 PM GMT
నా ప్ర‌పంచంలో భాగ‌మైనందుకు థ్యాంక్యూ
X
తెలుగులో వున్న హండ్స‌మ్ హీరోల్లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు శైలి ప్ర‌త్యేకం. ఆయ‌న క్రేజ్ కూడా అంతే ప్ర‌త్యేకంగా వుంటుంద‌న్న‌ది తెలిసిందే. అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న మ‌హేష్ ని న‌మ్ర‌త శిరోద్క‌ర్ సొంతం చేస‌కున్నారు. వీరి వివాహం జ‌రిగి దాదాపు ప‌దిహేడేళ్ల‌వుతోంది. అయినా వీరిద్ద‌రి మ‌ధ్య అనుబంధం ఇప్ప‌టికీ అలాగే వుంది. అదే ప్రేమతో సాగుతోంది. నేడు న‌మ్ర‌త శిరోద్క‌ర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా త‌న ప్రియ‌మైన శ్రీ‌మ‌తిగా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు మ‌హేష్ బాబు.

`హ్యాపీ బ‌ర్త్ డే `ఎన్ ఎస్ జి`(న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌జి). నువ్వు నా శిల‌వి. నాతో నా ప్ర‌పంచంలో భాగ‌మైనందుకు థ్యాంక్యూ` అంటూ ల‌వ్ ఎమోజీల‌తో న‌మ్ర‌త ఫొటోని అభిమానుల‌తో పంచుకున్నారు మ‌హేష్‌. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ఇన్ స్టా లో మ‌హేష్ షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట సంద‌డి చేస్తోంది. `వంశీ` చిత్రీక‌ర‌ణ సందర్భంగా ప్రేమ‌లో ప‌డిన ఈ జంట‌కు సంబంధించిన విశేషాలు మ‌రోసారి న‌మ్ర‌త పుట్టిన రోజు సంద‌ర్భంగా బ‌య‌టికి వ‌చ్చాయి.

ఈ సంద‌ర్భంగా ఓ ఆంగ్ల‌ మీడియాతో మాట్లాడుతూ పెళ్లికి ముందు సంగ‌తుల్ని గుర్తు చేసుకున్నారు న‌మ్ర‌త‌. మేము తొలిసారి క‌లిసి న‌టించిన `వంశీ` డిజాస్ట‌ర్ గా నిలిచింది.

అయినా స‌రే మాకు మాత్రం ఆ మూవీ ఎప్ప‌టికీ ప్ర‌త్యేకం. ఆ త‌రువాత మ‌హేష్ తో నాలుగేళ్ల పాటు దూరంగా వున్నాన‌ని, ఆ స‌మ‌యంలోనే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని, ఆ విష‌యాన్ని వాళ్ల ఇంట్లో వాళ్ల‌కి చెప్ప‌డానికి చాలా స‌మ‌యం తీసుకున్నార‌ని, నేనే త‌న‌కు స‌రైన వైఫ్ అని వాళ్ల‌ని ఒప్పించాడ‌ని, త‌న ఫ్యామిలీని ఎలాగైనా మ‌హేష్ ఒప్పిస్తాడ‌ని త‌న కోసం నాలుగేళ్లు ఎదురుచూశాన‌ని, అయితే ఆ స‌మ‌యంలో మ‌హేష్ ని మాత్ర‌మే వివాహం చేసుకోవాల‌ని గ‌ట్టిగా నిర్ణయించుకున్నాన‌న్నారు న‌మ్ర‌త.

పెళ్లై 17 ఏళ్లు కావ‌స్తున్నా ఇప్ప‌టికీ మ‌హేష్ - న‌మ్ర‌త‌ల మ‌ధ్య అదే ప్రేమ‌, అదే అనుబంధం కొన‌సాగుతోంది. సినీ జంట‌ల్లో వీరి ప్రేమ‌క‌థ ప్ర‌త్యేకం అని ఇప్ప‌టికీ చాలా మంది ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతుంటారు. మ‌హేష్ ప్ర‌తి అడుగులోనూ న‌మ్ర‌త క‌నిపిస్తూ వుంటుంది ఇదే నేమో ప్రేమంటే.