Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ మరక పోయి ఇప్పుడు ఇలా..!

By:  Tupaki Desk   |   27 May 2021 10:30 AM GMT
హీరోయిన్‌ మరక పోయి ఇప్పుడు ఇలా..!
X
కొన్ని రోజుల క్రితం తమిళ నటి రైజా విల్సన్ సోషల్‌ మీడియాలో ఒక చర్మ వైధ్యురాలిపై ఆరోపణలు చేస్తూ రచ్చ రచ్చ చేసింది. అవసరం లేకున్నా కూడా తనకు ట్రీట్ మెంట్‌ చేయడం వల్ల తన అందం చెడిపోయింది అంటూ రైజా విల్సన్ సోషల్‌ మీడియాలో ఫొటో షేర్‌ చేసింది. కంటి కింద నల్లగా మారి ఆమె అందం తగ్గినట్లుగా అందులో కనిపించింది. తన అందంను పోగొట్టినందుకు వైధ్యురాలు కోటి రూపాయలు చెల్లించాలంటూ డిమాండ్‌ చేసింది. రైజా విల్సన్ చేసిన ఆరోపణలకు వైధ్యురాలు కూడా చాలా సీరియస్ గా స్పందించింది. ఆమె ఏకంగా కోర్టుకు వెళ్లి 5 కోట్ల పరువు నష్టం దావాను వేసింది.

కట్‌ చేస్తే రైజా విల్సన్ తన కొత్త లుక్ ను షేర్‌ చేసింది. మునుపటి మాదిరిగానే రైజా విల్సన్ కనిపిస్తుంది. పూర్తిగా ఆమె కంటి కింద అయిన నల్ల మరక తొలగి పోయింది. ఆ సమయంలో ఆమె చేసిన హడావుడితో మళ్లీ ఈమె అందంగా కనిపిస్తుందా అనే అనుమానం వ్యక్తం అయ్యింది. కాని అనూహ్యంగా మళ్లీ ఈమె తన అందంను దక్కించుకుంది. అయితే ఆ వివాదం ఏం అయ్యింది అనేది తెలియలేదు.

రైజా విల్సన్ తమిళ బిగ్‌ బాస్ ద్వారా మంచి గుర్తింపును దక్కించుకుంది. సినిమాలు మరియు షో ల్లో కూడా కనిపిస్తున్న ఈమె మళ్లీ గ్లామర్ గా మారడంతో మరిన్ని ఆఫర్లు వస్తాయేమో చూడాలి. వైధ్యురాలు వేసిన పరువు నష్టం దావా విషయంలో రాజీ కుదిరి ఉంటుందనే టాక్ కూడా వినిపిస్తుంది.