Begin typing your search above and press return to search.

న్యూ ఇయర్ వేడుకల కోసం విమానం ఎక్కిన లవ్‌ బర్డ్స్‌

By:  Tupaki Desk   |   29 Dec 2022 10:09 AM GMT
న్యూ ఇయర్ వేడుకల కోసం విమానం ఎక్కిన లవ్‌ బర్డ్స్‌
X
బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా సుపరిచితురాలు అయిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ గత కొంత కాలంగా సిద్దార్థ్ మల్హోత్రా తో ప్రేమలో ఉంది అనే విషయం తెల్సిందే. అధికారికంగా వారు ప్రకటించలేదు కానీ.. మేము స్నేహితులం కంటే ఎక్కువ.. మా మధ్య ఉన్నది స్నేహం కంటే ఎక్కువ అన్నట్లుగా హింట్ ఇచ్చారు.

ఈ ఏడాది చివర్లో ఒక బిగ్‌ సర్‌ ప్రైజ్ ఉంటుంది అంటూ ఆ మధ్య కియారా అద్వానీ టాక్ షో లో చెప్పుకొచ్చారు. ఆ సర్‌ ప్రైజ్ ఏంటీ అనేది ఏడాది ముగియబోతున్నా క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా సిద్దార్థ్‌ మల్హోత్రా తో కలిసి విదేశాలకు న్యూ ఇయర్ వేడుకల కోసం వెళ్లడంతో ఇప్పటి వరకు కాస్త అనుమానం ఉన్న వారు కూడా ఏ అనుమానం లేకుండా వీరు రిలేషన్ లో ఉన్నారని నిర్ధారణకు వచ్చేస్తున్నారు.

తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్‌ లో కియారా మరియు సిద్దార్థ్ లు కనిపించారు. ఇద్దరు కలిసి ఎయిర్ పోర్ట్‌ కు వచ్చారని.. ఇద్దరు కలిసే లోనికి వెళ్లారు అంటూ అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్ష్యులు అంటున్నారు.

హీరోయిన్‌ గా కియారా అద్వానీ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది. అంతే కాకుండా సిద్దార్థ్‌ మల్హోత్ర కూడా వరుసగా కమిట్మెంట్స్ ను కలిగి ఉన్నాడు.

ఇంత బిజీ లైఫ్‌ లో కూడా వీరు బ్రేక్ తీసుకుని హాలీడే ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లడం చూస్తూ ఉంటే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం చాలా దూరం వెళ్లింది అనిపిస్తుంది.

వచ్చే ఏడాదిలో వీరిద్దరు తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా వెళ్లడించడం మాత్రమే కాకుండా పెళ్లి పీటలు ఎక్కే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.