Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ తో హీరో పెళ్లి క్యాన్సిల్ కి కార‌ణం?

By:  Tupaki Desk   |   22 Nov 2022 11:30 PM GMT
స్టార్ హీరోయిన్ తో హీరో పెళ్లి క్యాన్సిల్ కి కార‌ణం?
X
అప్ప‌టికే ప‌రిశ్ర‌మను ఏల్తున్న అగ్ర‌ హీరోయిన్ క‌రిష్మా క‌పూర్ తో ఇండ‌స్ట్రీ బిగ్ బి వార‌సుడు అభిషేక్ బ‌చ్చ‌న్ డేటింగ్ కొన‌సాగించారు. ఈ జంట క‌లిసి న‌టించారు. ఆ ఇద్ద‌రి స‌హ‌జీవ‌నంపైనా అప్ప‌ట్లో బోలెడన్ని క‌థ‌నాలొచ్చాయి. త్వ‌ర‌లోనే నిశ్చితార్థం పెళ్లి అంటూ మీడియా అంత‌టా క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. కానీ ఇంత‌లోనే ఆ నిశ్చితార్థం ఆగిపోయింది. పెళ్లి జ‌ర‌గ‌కుండా ఆ జంట బ్రేక‌ప్ అయ్యింది.

అభిషేక్ బచ్చన్- కరిష్మా కపూర్ డేటింగ్ వ్య‌వ‌హారం అనంత‌రం పెద్ద‌ల అంగీకారంతో నిశ్చితార్థం వ‌ర‌కూ వ‌చ్చింది సీన్. కానీ అనూహ్యంగా నిశ్చితార్థం త‌ర్వాత పెళ్లి ర‌ద్ద‌యింది. అలా ఎందుకు చేశారో ప్ర‌ముఖ ఫిలింమేక‌ర్ సునీల్ దర్శన్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

అభిషేక్ బచ్చన్ - కరిష్మా కపూర్ జంట ఆల్మోస్ట్ వివాహం చేసుకునేందుకు వేచి ఉన్నారు. అయితే సరైన కారణం చెప్పకుండానే వారి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారని చిత్రనిర్మాత సునీల్ దర్శన్ నాటి సంఘ‌ట‌న‌ల‌పై ఓపెన్ గా వెల్ల‌డించారు. అప్పటికే అభిషేక్ బచ్చన్ - కరిష్మా కపూర్ శృంగార సంబంధంలో ఉన్నారనేది రహస్యం కాదు. అంతా బ‌హిరంగ‌మే. ఈ జంట‌ 2000 ల ప్రారంభంలో దాదాపు 5 సంవత్సరాలు డేటింగ్ చేశారు. పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. అభిషేక్ - కరిష్మా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ వెంటనే వారు ఎటువంటి కారణం చెప్పకుండానే వివాహాన్ని ర‌ద్దు చేసుకున్నారు.. అని తెలిపారు.

2002 చిత్రం 'హాన్ మైనే భీ ప్యార్ కియా' నిర్మాత కావడంతో సునీల్ సెట్స్ లో అభిషేక్ - కరిష్మా జంట మ‌ధ్య‌ సమీకరణాన్ని నిశితంగా గమనించాడు. ఈ చిత్రానికి ధర్మేష్ దర్శన్ దర్శకత్వం వహించారు. ఇందులో అక్షయ్ కుమార్ కూడా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్ట‌రైన‌ తరువాత అభిషేక్ - కరిష్మా జంట విడిపోయారు.

అభిషేక్ - కరిష్మా జంట అనుబంధం పుకార్ల గురించి సునీల్ చాలా స్ప‌ష్టంగా వివ‌రించారు. నిజానికి ఈ జంట‌పై అస‌లు పుకార్లు లేవని ఆ ఇద్ద‌రి మ‌ధ్యా రిలేష‌న్ షిప్ నిజం అని చెప్పారు. తాము పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పారు. వారి నిశ్చితార్థానికి నేను కూడా హాజరయ్యానని చెప్పాడు. కానీ మూవీ చిత్రీకరణ సమయంలో అభిషేక్ - కరిష్మా సెట్స్‌లో నిరంతరం గొడవ పడుతుండటంతో వారి మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌ని చిత్రనిర్మాత సునీల్ గ్రహించారు.

వాళ్ళు నిజంగా 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' త‌ర‌హా కాదు.. నిరంతరం గొడవలు జరుగుతూనే ఉండేవి. బహుశా కొంతమంది అలానే ఉంటారు. నేను ఎప్పుడూ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' తరహా జంటలేనా అని ఎప్పుడూ సెల‌బ్రిటీ జంట‌ల గురించి ఆలోచిస్తూ ఉంటాను. అభిషేక్ స్వీట్ ఫెలో... లోలో (కరిష్మా ముద్దుపేరు) కూడా చాలా మంచి వ్యక్తి. కానీ కొన్ని విషయాలు విధిని అనుస‌రించి ఉండవచ్చు'' అని సునీల్ అన్నారు.

ఆ బ్రేక‌ప్ త‌ర్వాత చాలా కాలానికి ఐశ్వ‌ర్యారాయ‌ తో అభిషేక్ ప్రేమ‌లో ప‌డ్డాడు. త‌న‌ను వివాహం చేసుకున్నాడు. ఈజంట‌ ఆరాధ్యకు తల్లిదండ్రులు. కరిష్మా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు.. కుమార్తె సమైరా .. కుమారుడు కియాన్ ఉన్నారు. ఈ జంట 2016లో విడాకులు తీసుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.