Begin typing your search above and press return to search.

ముగ్గురికీ ఒకే పరీక్ష

By:  Tupaki Desk   |   4 Dec 2018 7:00 AM GMT
ముగ్గురికీ ఒకే పరీక్ష
X
బాక్స్ ఆఫీస్ దగ్గర 2.0 సందడి మెల్లగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో కొత్త సినిమాలు క్యు కట్టడం మొదలుపెట్టబోతున్నాయి. డిసెంబర్ 7 నుంచి ఈ సందడి స్టార్ట్ కాబోతోంది. కాకపోతే పోటీ పడుతున్న మూడు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. అదే హీరోలు. ముగ్గురూ బలమైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కావడం ఇప్పుడు చేస్తున్న జానర్ కెరీర్ లో మొదటిసారి ట్రై చేసినవిగా ఆయా అభిమానుల్లో ప్రత్యేకమైన అంచనాలు ఉండటం లాంటి సారూప్యతలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కవచం కావాల్సినన్ని ఆకర్షణలతో ముస్తాబవుతోంది. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ సక్సెస్ అందుకోలేకపోయిన శ్రీనివాస్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా ఫస్ట్ టైం చేస్తున్నాడు. దర్శకుడు శ్రీనివాస్ కొత్తవాడే అయినప్పటికీ కాజల్ అగర్వాల్-మెహ్రీన్ ల గ్లామర్ తో పాటు సాహో విలన్ నీల్ నితీష్ డెబ్యుతో పాటు భారీ నిర్మాణం లాంటి అంశాలు మాస్ ని ఆకర్షిస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ మీద ట్రేడ్ కూడా ఆసక్తిగానే ఉంది. ఇక చాలా గ్యాప్ తర్వాత మళ్ళి రావాతో చెప్పుకోదగ్గ సక్సెస్ సాధించిన సుమంత్ సుబ్రమణ్యపురం కూడా పోటీలో ఉంది. మళ్ళి రావా హిట్ అయినా కమర్షియల్ లెక్కల్లో ఏ సెంటర్స్ లో మాత్రమే వర్క్ అవుట్ అయ్యింది. యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు.

అందుకే సుబ్రహ్మణ్యపురం అన్ని వర్గాలను రీచ్ అయ్యే థ్రిల్లర్ గా దీని మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. టెంపుల్ థ్రిల్లర్ గా ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకుంది. ఇక సందీప్ కిషన్ నవదీప్ తమన్నాల రొమాంటిక్ మూవీ నెక్స్ట్ ఏంటి సైతం లైన్ లో ఉంది. బాలీవుడ్ ఫేమ్ జనాలు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్ ఆడియో యూత్ లో అంచనాలు పెంచేసింది. సందీప్ కిషన్ బలంగా బౌన్స్ అవ్వడం కోసం చూస్తున్నాడు. సో ఈ ట్రయాంగిల్ వార్ లో ఉన్న ముగ్గురు హీరోల లక్ష్యం ఒకటే ఉంది. మరి ఎవరు విన్ అవుతారు అనేదే ప్రేక్షకుల చేతుల్లో ఉంది