Begin typing your search above and press return to search.

మెగా హీరోని క‌లిసిన కేంద్ర మంత్రి

By:  Tupaki Desk   |   1 Jan 2022 3:30 PM GMT
మెగా హీరోని క‌లిసిన కేంద్ర మంత్రి
X
మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఇటీవ‌ల బైక్ ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలిసిందే. సెప్టెంబ‌ర్ 10 రాత్రి 7:45 నిమిషాల‌కు గ‌చ్చిబౌలి స‌మీపంలో బైక్ స్క‌డ్ కావ‌డంతో ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఈ వార్త అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. ఈ ప్రామాదాన్ని గ‌మ‌నించిన ఓ వ్యక్తి సాయి ధ‌ర‌మ్ తేజ్ ని స‌మీపంలో వున్న ఆసుత్రిలో చేర్పించ‌డంతో ఆయ‌న‌కు ప్రాణాపాయం త‌ప్పింది. త‌మ అభిమాన హీరోకు ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలియ‌డంతో మెగా అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

త‌న స్పోర్ట్స్ బైక్ పై కేబుల్ బ్రిడ్జి మీదుగా ఐకియా వైపు వెళుతూ ఆదారిలో రోడ్డుపై ఇసుక వుండ‌టంతో స్పోర్ట్స్ బైక్ పై వెళుతున్న సాయిధ‌ర‌మ్ తేజ్ ఉన్న‌ట్టుండి బైక్ స్కిడ్ కావ‌డంతో కిండ‌ప‌డిపోయాడు. ఈ ప్ర‌మాదంలో తేజుకు తీవ్ర గాయాల‌య్యాయి, వెంట‌నే అత‌న్ని స‌మీపంలో వున్న మెడిక‌వ‌ర్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వెంటనే తేజుకు చికిత్స అందించారు. ఆ త‌రువాత అక్క‌డి నుంచి తేజ్ ని జూబ్లీహిల్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు.

షోల్డ‌ర్ పై బోన్ ఫ్ర‌క్చ‌ర్ కాండంతో అందుకు సంబంధించిన శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. అప్ప‌టి నుంచి ఇంటి వ‌ద్దే వుంటూ తేజు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీపావ‌ళి రోజు తేజ్ పూర్తిగా కోలుకున్నాడ‌ని మెగాస్టార్ చిరంజీవి వెల్ల‌డించారు. ఈ వార్త విని మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ త‌రువాత కానీ తేజ్ మాత్రం బ‌య‌టికి రాలేదు. ఎవ‌రికీ క‌నిపించ‌లేదు. ఇటీవ‌ల చిరంజీవి తండ్రి వ‌ర్థంతి సంద‌ర్భంగా తేజ్ వ‌రుణ్ తేజ్ తో క‌లిసి మాస్క్ ధ‌రించి క‌నిపించారు.

ఇదిలా వుంటే తేజ్ పూర్తి కోలుకోవ‌డంతో ఆయ‌న‌ని ప‌రామ‌ర్శించ‌డానికి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స్వ‌యంగా రావ‌డం గ‌మ‌నార్హం. స్వ‌యంగా తేజ్ ఇంటికి వెళ్లిన మంత్రి కిష‌న్ రెడ్డి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెల‌ప‌డ‌మే కాకుండా తేజ్ యోగా క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొంత సేపు తేజ్ తో గ‌డిపి అత‌నితో ముచ్చ‌టించారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ స్వ‌యంగా సోస‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసి అభిమానుల‌తో పంచుకున్నారు.

ఈ సంద‌ర్భంగా కొన్ని ఫొటోల‌ని షేర్ చేశారు. ధ‌న్య‌వాదాలు కిష‌న్ రెడ్డి గారు.. మీరు మీ బిజీ షెడ్యూల్ లోనూ న‌న్ను క‌ల‌వ‌డానికి స్వ‌యంగా మా ఇంటికి రావ‌డం చాలా ఆనందాన్ని క‌లిగించింది. ఈ న్యూ ఇయ‌ర్ మీకు అద్భుతంగా వుండాల‌ని కోరుకుంటున్నా` అంటూ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో దిగిన ఫొటోల‌ని అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఇటీవ‌ల `రిప‌బ్లిక్` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సాయి ధ‌ర‌మ్ తేజ్ త్వ‌ర‌లో సంప‌త్ నంది డైరెక్ష‌న్ లో ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది. తేజు ఈ షూటింగ్ లో పాల్గొన‌బోతున్నాడు.