Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కోసం మాజీ మిస్ ఇండియానే దించేశారుగా..!

By:  Tupaki Desk   |   4 Nov 2022 5:34 AM GMT
మెగాస్టార్ కోసం మాజీ మిస్ ఇండియానే దించేశారుగా..!
X
మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ "వాల్తేరు వీరయ్య". రవీంద్ర కొల్లి (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరపుకుంటోంది.

ఇటీవల హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ ఓపెన్ సెట్ లో ఓ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించారు. చిరంజీవి మరియు రవితేజ పాల్గొన్న ఈ పాట సినిమాలో ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు. అయితే ఈ ఐటమ్ సాంగ్ లో మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతెలా చిందులేసినట్లు తెలుస్తోంది.

తెలుగులో 'బ్లాక్ రోజ్' అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన అందాల ఊర్వశి రౌటెల.. ఇటీవల రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' సినిమాలో కూడా ఊర్వశినే ఐటమ్ సాంగ్ చేసినట్లు సమాచారం.

ఐటమ్ సాంగ్స్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ అయిన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఇప్పుడు వీరయ్య కోసం ఓ సరికత్త ట్యూన్ ని కంపోజ్ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. గతంలో చిరజీవి మరియు రవితేజ సినిమాలకు దేవి అందించిన పాటల్లోని ట్యూన్స్ తీసుకొని.. రీమిక్స్ చేసి ఒక కొత్త తరహా పాట చేశారని ఇన్సైడ్ టాక్.

'ఖైదీ నెం.150' తర్వాత చిరంజీవి చేసిన స్పెషల్ సాంగ్ ఇదే. దీనికి శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసారు. మెగా మాస్ హీరోలతో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా కలిసి చేసిన ఈ ఐటమ్ సాంగ్.. మాస్ ఆడియన్స్ కి ట్రీట్ ఇస్తుందేమో వేచి చూడాలి.

'వాల్తేరు వీరయ్య' సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. రవితేజ కు జోడీగా క్యాథరిన్ నటిస్తోంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రంలో చిరు మునుపెన్నడూ చూడని మాస్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన టైటిల్ టీజర్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కోన వెంకట్ మరియు కె.చక్రవర్తి రెడ్డి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరెక్కుతున్న 'వాల్తేరు వీరయ్య' సినిమాని 2023 సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.