Begin typing your search above and press return to search.

క్రేజీ కాంబో కు యువీ గ్రీన్ సిగ్న‌ల్‌?

By:  Tupaki Desk   |   2 Sep 2022 3:30 PM GMT
క్రేజీ కాంబో కు యువీ గ్రీన్ సిగ్న‌ల్‌?
X
క్రేజీ కాంబోకు టాలీవుడ్ స్టార్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ యువీ క్రియేష‌న్స్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే... కోలీవుడ్ లో స్టార్ డైరెక్ట‌ర్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న యంగ్ టాలెంటెడ్ లోకేష్ క‌న‌గ‌రాజ్‌. కార్తితో 'ఖైదీ', ద‌ళ‌ప‌తి విజ‌య్ తో 'మాస్ట‌ర్' వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాడు. ఈ రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ ల త‌రువాత లోకేష్ క‌న‌గ‌రాజ్ చేసిన మ‌రో మూవీ 'విక్ర‌మ్‌'.

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ దాదాపు నాలుగేళ్ల విరామం త‌రువాత న‌టించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జూన్ లో భారీ స్థాయిలో విడుద‌లై ఊహించ‌ని విధంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డ‌మే కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేసింది. క‌మ‌ల్ హాస‌న్ ఎంతో కాలంగా ఇలాంటి విజ‌యం కోస‌మే ఎదురుచూస్తూ వ‌చ్చారు. ఈ స‌క్సెస్ తో గ‌త కొన్నేళ్లుగా అప్పుల్లో వున్న క‌మ‌ల్ అప్పుల‌న్నింటినీ తీర్చేసి లాభాల్లోకి వ‌చ్చేశారు.

దీంతో లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌క్షిణాదిలోనే హాట్ ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ల జాబితాలో చేరిపోయాడు. లోకేష్ క‌న‌గ‌రాజ్ సినిమాటిక్ యునివ‌ర్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన 'విక్ర‌మ్‌' మేకింగ్‌, టేకింగ్ కి స్టార్స్ సైతం ఫిదా అయిపోయారు. ఎలాగైనా లోకేష్ తో ఓ భారీ యాక్ష‌న్ క‌ల్ట్ థ్రిల్ల‌ర్ ని చేయాల‌ని చాలా మంది ద‌క్షిణాది హీరోలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం లోకేష్ క‌న‌గ‌రాజ్ మాత్రం త‌మిళ స్టార్ హీరో విజ‌య్ తో ఓ భారీ గ్యాంగ్‌స్ట‌ర్ మూవీని చేయ‌బోతున్నారు.

దీని త‌రువాత కార్తితో 'ఖైదీ 2' వుంటుంది. అయితే ఈ మ‌ధ్య‌లో త‌న‌తో క‌లిసి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఓ మూవీ చేయ‌బోతున్నాడంటూ ఇటీవ‌ల వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త కొంత కాలంగా లోకేష్ క‌న‌గ‌రాజ్‌, రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య మంచి అనుబంధం కొన‌సాగుతోంది. 'విక్ర‌మ్‌' స‌క్సెస్ త‌రువాత ఈ ఇద్ద‌రు ప్ర‌త్యేకంగా క‌లిశారు కూడా. అయితే ఆ సంద‌ర్భంగా ఇద్ద‌రు క‌లిసి సినిమా చేయాల‌ని అనుకోలేద‌ట‌. ఆ ప్ర‌స్తావ‌నే ఇద్ద‌రి మ‌ధ్య రాలేద‌ట‌.

కానీ తాజాగా లోకేష్ క‌న‌రాజ్ తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ ఓ భారీ సినిమా చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ మీడియాతో ముచ్చ‌టిస్తూ రామ్ చ‌ర‌ణ్ తో సినిమా చేయాల‌ని వుంద‌ని లోకేష్ క‌న‌గ‌రాజ్ వెల్ల‌డించ‌డం తాజా వార్త‌ల‌కు బ‌లాన్ని చేకూర్చింది.

ఇదిలా వుంటే తాజాగా ఈ ఇద్ద‌రి కాంబోలో యువీ క్రియేష‌న్స్ భారీ మూవీని లెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టుగా తెలిసింది. గౌత‌మ్ తిన్న‌నూరితో చేయాల‌నుకున్న ప్రాజెక్ట్ ని లోకేష్ క‌న‌గ‌రాజ్ తో ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టుగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌.. శంక‌ర్ డైరెక్ష‌న్ లో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.