Begin typing your search above and press return to search.

పిక్ టాక్: లోకల్ ట్రైన్ లో 'లైగర్' బ్యూటీ ఒడిలో పడుకున్న VD..!

By:  Tupaki Desk   |   29 July 2022 7:30 AM GMT
పిక్ టాక్: లోకల్ ట్రైన్ లో లైగర్ బ్యూటీ ఒడిలో పడుకున్న VD..!
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ''లైగర్'' మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఇది తన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో దూకుడుగా ప్రమోట్ చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ స్పోర్ట్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కింది. ఇందులో వీడీ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

సినిమా రిలీజ్ కు సరిగ్గా నాలుగు వారాలే ఉండటంతో 'లైగర్' టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే విడుదలైన టీజర్ - ట్రైలర్ మరియు ఫస్ట్ సింగిల్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'వాట్ లగా దేంగే' అనే మరో సాంగ్ ని లాంచ్ చేశారు.

ఆన్ లైన్ లోనే కాదు ఆఫ్ లైన్ లోనూ 'లైగర్' సినిమాను జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ మరియు ముంబై నగరాల్లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా లైగర్ జోడీ లోకల్ ట్రైన్ ఎక్కి సందడి చేశారు.

విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే ఇద్దరూ కలిసి ఈరోజు శుక్రవారం ఉదయం ముంబైలో లోకల్ ట్రైన్ లో జర్నీ చేశారు. రైలు ప్రయాణానికి సంబంధించిన కొన్ని ఫోటోలను హీరోయిన్ అనన్య పాండే ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. "LIGER ప్రమోషన్లు 'ట్రాక్‌ లో ఉన్నాయి'..లెట్స్ గో బాయ్స్" ని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక ఫొటోలో రైల్లో అనన్య కూర్చుని ఉండగా.. విజయ్ ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకున్నట్లు చూపిస్తుంది. మరో ఫొటోలో ఇద్దరూ ఫ్లాట్ ఫార్మ్ వద్ద కూర్చొని పోజిచ్చారు. ఇందులో అనన్య ఎల్లో క్రాప్ టాప్ మరియు డెనిమ్స్‌ లో ఉండగా.. విజయ్ దేవరకొండ మాత్రం బ్లాక్ టీ షర్ట్ - డెనిమ్స్ ధరించి ఉన్నాడు. దీనిపై ‘వాట్ లగా దేంగే’ అని రాసి ఉంది. అంతేకాదు వీడీ మామూలు చెప్పులు వేసుకొని ఉండటాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు.

అయితే లైగర్ జోడీ ఖాళీగా ఉన్న లోకల్ ట్రైన్‌ లో ప్రయాణించారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఖాళీ లోకల్ = లోకల్ కాదు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఎంప్టీ లోకల్ ట్రైన్ లో జర్నీ చేయడమే అసలైన స్ట్రగుల్ అని మరొకరు వ్యగ్యంగా వ్యాఖ్యానించారు.

కాగా, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతున్న 'లైగర్' చిత్రంలో విజయ్ ఒక బాక్సర్ గా కనిపించనున్నాడు. లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు. రమ్యకృష్ణ - రోనిత్ రాయ్ - విషు రెడ్డి - అలీ - మకరంద్ దేశ్ పాండే - గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటించారు.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ - కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందించగా.. థాయ్‌ లాండ్‌ కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్‌ గా వర్క్ చేశారు.


'లైగర్' చిత్రాన్ని ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.