Begin typing your search above and press return to search.

ఆ కుర్రాడు వజ్రం అంటున్న విజయేంద్ర ప్రసాద్

By:  Tupaki Desk   |   19 Sept 2016 12:55 PM IST
ఆ కుర్రాడు వజ్రం అంటున్న విజయేంద్ర ప్రసాద్
X
‘జాగ్వార్’ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్న నిఖిల్ కుమార్ వజ్రం అంటున్నాడు ఆ చిత్రానికి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమాకు కథ రాయమని తనను పిలిచినపుడు నిఖిల్ మీద తనకు ఎలాంటి ఫీలింగ్ లేదని.. ఐతే నిఖిల్ తన టాలెంట్ చూపించడం కోసం చేసిన ఏవీ చూశాక మాత్రం అతడి మీద తన ఇంప్రెషన్ మారిపోయిందని.. అతనో వజ్రం అన్న సంగతే అర్థమైందని.. తర్వాత అతడిని తన చేతుల్లోకి తీసుకున్నానని విజయేంద్ర అన్నారు.

‘‘కుమారస్వామి గారు గత ఏడాది నన్ను పిలిచి.. తన కొడుకు కోసం కథ రాయమన్నారు. ఆయన నన్ను బ్రదర్ అని సంబోధించారు. ఆ మాట నోటి నుంచి కాకుండా గుండెల్లోంచి వచ్చినట్లు అనిపించింది. తర్వాత నిఖిల్ కు సంబంధించిన వీడియో ఒకటి చూపించారు. అది చూసి నాకు మతిపోయింది. నిఖిల్ ఓ ముడి వజ్రం అని.. అతణ్ని సానబెడితే ఎక్కడికో వెళ్తాడని అర్థమైంది. వెంటనే కుమారస్వామి గారికి చెప్పాను.. నిఖిల్ ను నాకు అప్పగించమని. అద్భుతమైన కథ రాస్తాను అని చెప్పి ‘జాగ్వార్’ రాశాను. ఈ మధ్యే సినిమా చూశాను. అత్యద్భుతంగా ఉంది. నిఖిల్ అదరగొట్టాడు. అతను ఓ సూపర్ హీరో అవుతాడు. కొన్ని రోజుల కిందటే మాండ్యలో కన్నడ ఆడియో వేడుక జరిగింది. అప్పుడు జనాల హంగామా చూడాలి. ఓ సూపర్ స్టార్ లాగా నిఖిల్ ను ఆదరించారు. అయినా నిఖిల్ లో ఎలాంటి గర్వం లేదు. చాలా ఒద్దికగా ఉంటాడు. ఈ చిత్ర దర్శకుడు మహదేవ్ నాకు కొడుకు లాంటి వాడు. రాజమౌళిలో ఎంత ప్రతిభ ఉందో.. అతడిలోనూ అంత టాలెంట్ ఉంది. కచ్చితంగా జాగ్వార్ సూపర్ హిట్టవుతుంది. నిఖిల్ మంచి స్థాయికి వెళ్తాడు’’ అని ఆయన అన్నారు.