Begin typing your search above and press return to search.
బాలయ్యతో ఢీ కొట్టబోతున్న 'మాస్టర్' విలన్
By: Tupaki Desk | 19 Aug 2021 10:30 AM GMTనందమూరి బాలకృష్ణ అఖండ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. రెండు పాటలు మినహా అఖండ సినిమాను ముగించినట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించారు. అఖండ తర్వాత బాలయ్య చేయబోతున్న సినిమా ఇప్పటికే గోపీచంద్ మలినేని అని కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఏడాది ఆరంభంలో క్రాక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ను దక్కించుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక మంచి కాన్సెప్ట్ తో రియల్ లైఫ్ సంఘటనలకు కల్పితంను జోడించి రెడీ చేసిన కథ పై బాలయ్య చాలా నమ్మకంగా ఉన్నారట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక విషయమై చర్చలు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ ను ఎంపిక చేయాలని గోపీచంద్ తీవ్రంగా ప్రయత్నించాడు. కాని ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా బాలయ్య మూవీకి డేట్లు ఇవ్వలేక పోతున్నట్లుగా సారీ చెప్పేసింది. దాంతో హీరోయిన్ గా మరో ముద్దుగుమ్మను ఎంపిక చేసేందుకు గాను దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో ఈ సినిమాలో విలన్ రోల్ కు గాను కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అఖండ సినిమా లోనే బాలీవుడ్ స్టార్ ను నటింపజేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని కొన్ని కారణాల వల్ల ఆయన నటించలేదు. కాని బాలయ్య తో గోపీచంద్ మలినేని సినిమాలో మాత్రం ఖచ్చితంగా తమిళ స్టార్ విజయ్ సేతుపతి నటించబోతున్నట్లుగా చెబుతున్నారు.
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ సినిమా లో విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. విలన్ ఇలా కూడా ఉంటారా అన్నట్లుగా అనిపించేలా విజయ్ సేతుపతి నటించాడు. అద్బుతమైన నటనతో విలనిజం కు మారు పేరు అన్నట్లుగా నిలిచిచాడు. ఇక ఉప్పెన సినిమా లో ఆయన పోషించిన పాత్ర ఒక అద్బుతం అన్నట్లుగా నిలిచింది. ఉప్పెన సక్సెస్ లో సగ భాగం ఆయనకే చెల్లుతుంది అనడంలో సందేహం లేదు. అందుకే ఆయన ప్రస్తుతం నటుడిగా ఎంతో బిజీ అయ్యాడు. పలువురు స్టార్ హీరోల సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా లేదా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. ఒక వైపు హీరోగా కూడా నటిస్తూనే విజయ్ సేతుపతి ఇతర భాషల్లో బిజీ అయ్యాడు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ యాక్టర్ ల్లో ఒక్కడిగా విజయ్ సేతుపతి కొనసాగుతున్నాడు. కనుక బాలయ్య మూవీకి విజయ్ సేతుపతి ఖచ్చితంగా పాజిటివ్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ ను ఎంపిక చేయాలని గోపీచంద్ తీవ్రంగా ప్రయత్నించాడు. కాని ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా బాలయ్య మూవీకి డేట్లు ఇవ్వలేక పోతున్నట్లుగా సారీ చెప్పేసింది. దాంతో హీరోయిన్ గా మరో ముద్దుగుమ్మను ఎంపిక చేసేందుకు గాను దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో ఈ సినిమాలో విలన్ రోల్ కు గాను కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అఖండ సినిమా లోనే బాలీవుడ్ స్టార్ ను నటింపజేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని కొన్ని కారణాల వల్ల ఆయన నటించలేదు. కాని బాలయ్య తో గోపీచంద్ మలినేని సినిమాలో మాత్రం ఖచ్చితంగా తమిళ స్టార్ విజయ్ సేతుపతి నటించబోతున్నట్లుగా చెబుతున్నారు.
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ సినిమా లో విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. విలన్ ఇలా కూడా ఉంటారా అన్నట్లుగా అనిపించేలా విజయ్ సేతుపతి నటించాడు. అద్బుతమైన నటనతో విలనిజం కు మారు పేరు అన్నట్లుగా నిలిచిచాడు. ఇక ఉప్పెన సినిమా లో ఆయన పోషించిన పాత్ర ఒక అద్బుతం అన్నట్లుగా నిలిచింది. ఉప్పెన సక్సెస్ లో సగ భాగం ఆయనకే చెల్లుతుంది అనడంలో సందేహం లేదు. అందుకే ఆయన ప్రస్తుతం నటుడిగా ఎంతో బిజీ అయ్యాడు. పలువురు స్టార్ హీరోల సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా లేదా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. ఒక వైపు హీరోగా కూడా నటిస్తూనే విజయ్ సేతుపతి ఇతర భాషల్లో బిజీ అయ్యాడు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ యాక్టర్ ల్లో ఒక్కడిగా విజయ్ సేతుపతి కొనసాగుతున్నాడు. కనుక బాలయ్య మూవీకి విజయ్ సేతుపతి ఖచ్చితంగా పాజిటివ్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.