Begin typing your search above and press return to search.

శ్రియ భర్తకు ఏమైంది? అపోలో ఆసుపత్రిలో చేరారెందుకు?

By:  Tupaki Desk   |   2 March 2022 4:49 AM GMT
శ్రియ భర్తకు ఏమైంది? అపోలో ఆసుపత్రిలో చేరారెందుకు?
X
సెలబ్రిటీ జంటలకు కొదవ లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని.. సెలబ్రిటీలంతా తమ పర్సనల్ లైఫ్ ను సోషల్ మీడియాలో ఎంతలా షేర్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే.. మిగిలిన సెలబ్రిటీలకు కాస్త భిన్నంగా ఉంటుంది శ్రియ జంట.

రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ ఆండ్రూ కొశ్చివ్ ను ప్రేమించి.. పెళ్లాడిన సంగతి తెలిసిందే. వారి వైవాహిక జీవితం ఎంత ఫన్నీగా.. మరెంత రొమాంటిక్ గా సాగుతుందన్న విషయాన్ని శ్రియ తన వీడియోలతో తరచూ చెప్పేయటం తెలిసిందే.

ఆమె షేర్ చేసిన వీడియోల్లో కొన్నింటిపైనా నెగిటివ్ కామెంట్లు కూడా పడ్డాయి. మీరు.. మీ రొమాన్సు.. మరీ ఇంతలానా? అంటూ కోపగించుకున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే.. వాటినేమీ పట్టించుకోకుండా పోస్టుల మీద పోస్టులు పెట్టే ఈ జంట పండంటి కాపురానికి గుర్తుగా ముద్దులొలికే పాప పుట్టటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా తన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని వెల్లడించి షాకిచ్చింది శ్రియ.

కొంతకాలంగా తన భర్త హెర్నియాతో బాధ పడుతున్నాడని.. ఆయన్ను అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లుగా చెప్పిన శ్రియ.. ఇప్పుడు అతను కోలుకుంటున్న విషయాన్ని పోస్టు రూపంలో పేర్కొంది. అంతేకాదు.. అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి.. ఉపాసనకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది.

శ్రియ పోస్టుకు స్పందించిన ఉపాసన.. అంతా మంచే జరిగినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది.

అనారోగ్యంతో ఉన్న తన భర్త.. తన చిన్నారి కుమార్తెను కూడా ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఉండేవాడని.. ఇప్పుడు పరిస్థితి మారినట్లు పేర్కొంది. తాజాగా తన భర్త ఆండ్రూ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. శ్రియ పోస్టుతో పలువురు.. హెర్నియా అంటే ఏంటి? దాని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి? లాంటి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా.. ఈ ముద్దులొలికే జంటకు అంతామంచే జరగాలని ఆశిద్దాం.