Begin typing your search above and press return to search.

యంగ్ టైగ‌ర్ మైండ్ లో ఏం ర‌న్న‌వుతోంది?

By:  Tupaki Desk   |   18 Jun 2022 9:30 AM GMT
యంగ్ టైగ‌ర్ మైండ్ లో ఏం ర‌న్న‌వుతోంది?
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ దాదాపు మూడున్న‌రేళ్ల పాటు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంత తెర‌కెక్కించిన మాగ్న‌మ్ ఓప‌స్ 'RRR' కోసం కేటాయించారు. ఈ సినిమా పూర్త‌యి రిలీజ్ అయ్యేంత వ‌ర‌కు ఏ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్ర‌మ‌య‌త్నం చేయ‌లేదు. కేవ‌లం ఈ ప్రాజెక్ట్ కోస‌మే డెడికేటెడ్ గా వ‌ర్క్ చేశాడు. దాదాపు మూడేళ్లుగా వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు మార్చిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు భాష‌ల్లో విడుద‌లైంది. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా మంచి టాక్ ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

ఈ మూవీ త‌రువాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రాల‌పై దృష్టి పెట్టారు. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల‌ని ప్ర‌క‌టించి షాక్ ఇచ్చారు. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శ‌వ డైరెక్ష‌న్ లో త‌న 30వ సినిమాని చేయ‌బోతున్నాన‌ని 'RRR' రిలీజ్ కు ముందే ప్ర‌క‌టించినా మే 20న ఈ మూవీ డైలాగ్ మోష‌న్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసి ఏ రేంజ్ లో ఈ మూవీని తీయ‌బోతున్నామో స్ప‌ష్టం చేశారు. ఐదు భాష‌ల్లో ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయ‌బోతున్నామ‌ని క్లారిటీ ఇచ్చారు.

ఇక ఇదే స‌మ‌యంలో 'కేజీఎఫ్' ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లోనూ ఓ భారీ మూవీ ని ప్ర‌క‌టించారు. ఫ‌స్ట్ లుక్ ని కూడా విడుద‌ల చేసి ఫ్యాన్స్ తో పాటు సినీ ల‌వ‌ర్స్ ని స‌ర్ ప్రైజ్ చేశారు. అయితే ఈ రెండు చిత్రాల్లో ఇంత వ‌ర‌కు ఏ ఒక్క సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. అధికారికంగా రెండు ప్రాజెక్ట్ లు చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు కానీ షూటింగ్ మాత్రం ఇంకా ఏ మూవీది స్టార్ట్ కాలేదు.

ఇదిలా వుంటే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తాజాగా మ‌రో క్రేజీ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. ముందు అంగీక‌రించిన రెండు ప్రాజెక్ట్స్ పూర్త‌యిన త‌రువాత వెంట‌నే మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించాల‌ని ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌.

రీసెంట్ త‌మిళ ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ హీరో ఎన్టీఆర్ ని క‌లిసి ఓ టెర్రిఫిక్ లైన్ వినిపించార‌ట‌. వెంట‌నే ఎన్టీఆర్ త‌న‌తో సినిమాకు ఓకే చెప్పేశాడ‌ట‌. వెట్రిమార‌న్ ఇటీవ‌ల ధ‌నుష్ న‌టించిన 'అసుర‌న్‌'తో పాటు విసార‌ణై, వ‌డాచెన్నై వంటి ఇంటెన్స్ మూవీస్ ని రూపొందించి జాతీయ అవార్డుని సొంతం చేసుకున్నారు.

ఈ ద‌ర్శ‌కుడితో క‌మ‌ర్శియ‌ల్ సినిమా అంటే క‌ష్ట‌మే. కానీ ఎన్టీఆర్ ఈ ద‌ర్శ‌కుడికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఆయ‌న మైండ్ లో ఏం ర‌న్న‌వుతోంద‌ని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నార‌ట‌. వెట్రిమార‌న్ - ఎన్టీఆర్ ల మూవీని పాన్ ఇండియా లెవెల్లో తెర‌పైకి తీసుకురానున్నార‌ని, దీనికి ఓ ఫేమ‌స్ ప్రొడ్యూస‌ర్ ఈ మూవీని నిర్మించనున్నార‌ని తెలిసింది.