Begin typing your search above and press return to search.

రియా ప్రయాణిస్తున్న కారు ఎవరిది...?

By:  Tupaki Desk   |   7 Aug 2020 11:33 PM IST
రియా ప్రయాణిస్తున్న కారు ఎవరిది...?
X
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్‌ సూసైడ్ కేసు అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ ని రియా ఆర్థికంగా మోసం చేసి బలవన్మరణానికి పాల్పడేలా ప్రేరేపించిందని.. సుశాంత్ ఖాతా నుంచి రియా చక్రవర్తి రూ.15 కోట్లు వేరే ఖాతాకు మళ్లించిందని సుశాంత్ తండ్రి ఆరోపించాడు. బీహార్ పోలీసుల ఎఫ్.ఐ.ఆర్ నివేదిక ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసి రియా చక్రవర్తితో పాటు పలువురికి సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం రియా చక్రవర్తి తన సోదరుడు షోయిక్‌ చక్రవర్తితో కలిసి ముంబైలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైంది.

కాగా రియా చక్రవర్తి ఈడీ కార్యాలయానికి ఫోర్డ్ ఎండీవర్ కారులో వచ్చింది. దీంతో ఆ కారు ఎవరిది.. ఎవరెవరు వచ్చారు అనే దాని మీద అందరూ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రియా మీద అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సుమారు 30 నుంచి 35 లక్షల విలువ చేసే ఆ కారు ఆమెదా కాదా అనే విషయంపై నేషనల్ మీడియా దృష్టి సారించింది. ఈ క్రమంలో రియా వచ్చిన ఆ కారు ఆమెది కాదని తెలిసింది. అది ముంబైకి చెందిన నటుడు వ్యాపారవేత్త సువేద్ లోహియాది కి చెందిన కారు అని తెలుస్తోంది.

పలు హిందీ సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ ప్లే చేసిన సువేద్.. దివంగత సుశాంత్ సింగ్ మరియు రియాతో సన్నిహితంగా ఉండేవాడని అతని ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలుస్తోంది. ఇక ఆ కారులో రియాతో పాటు వచ్చిన తన సోదరుడు షోయిక్‌ చక్రవర్తి 2 గంటల అనంతరం ఈడీ ఆఫీస్ నుండి బయటకి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద రియా చక్రవర్తిని ఈడీ అధికారులు 8 గంటలపాటు విచారించిన తర్వాత షోయిక్‌ మళ్ళీ ఈడీ కార్యాలయానికి వచ్చి ఆమెను తీసుకొని పోయాడని సమాచారం.