Begin typing your search above and press return to search.

పిల్లల కోసం రేణు మనసు మార్చుకుందా?

By:  Tupaki Desk   |   3 Oct 2019 11:30 AM GMT
పిల్లల కోసం రేణు మనసు మార్చుకుందా?
X
పవన్‌ కళ్యాణ్‌ నుండి విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్‌ మహారాష్ట్రకు వెళ్లి పోవడం జరిగింది. చాలా ఏళ్లుగా అక్కడే పిల్లలను పెంచుతూ ఉన్న రేణు దేశాయ్‌ మళ్లీ హైదరాబాద్‌ రావాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పిల్లలు పెద్ద వారు అవుతున్న ఈ సమయంలో వారికి తండ్రి ప్రేమ మరియు కుటుంబ సభ్యులు చాలా అవసరం. అందుకే హైదరాబాద్‌ కు వస్తే పవన్‌ కళ్యాణ్‌ ను రెగ్యులర్‌ గా కలవడంతో పాటు పవన్‌ తరపు బంధువులైన మెగా ఫ్యామిలీ అంతా కూడా వారిని రెగ్యులర్‌ గా కలవడం జరుగుతుంది.

హైదరాబాద్‌ లో గతంలో రేణు దేశాయ్‌ ఉండేది. ఆమెకు హైదరాబాద్‌ తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కనుక ఆమె మళ్లీ హైదరాబాద్‌ వచ్చేందుకు ఆసక్తిగానే ఉందనే టాక్‌ వినిపిస్తుంది. గత కొన్నాళ్లుగా రేణు దేశాయ్‌ నటిగా రీ ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. ఒక సినిమాలో నటించబోతున్నట్లుగా స్వయంగా ఆమె ప్రకటించింది. సినిమా మాత్రమే కాకుండా బుల్లి తెరపై కూడా రేణు దేశాయ్‌ సందడి చేయబోతుంది.

ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ కొత్త సీజన్‌ లో రేణు దేశాయ్‌ జడ్జ్‌ గా వ్యవహరిస్తున్నారు. ఢీ షూటింగ్స్‌ కు హాజరు అయ్యేందుకు వీలుగా.. నటిగా కొనసాగేందుకు వీలుండాలని రేణు దేశాయ్‌ హైదరాబాద్‌ కు మారే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పిల్లల కోసం మరియు తన కెరీర్‌ ఇలా రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఆమె ఇక్కడకు వచ్చేందుకు సిద్దమయినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రేణు దేశాయ్‌ చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ఆమెను మళ్లీ నటిగా చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. త్వరలోనే రేణు దేశాయ్‌ ని క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చూస్తామేమో చూడాలి.