Begin typing your search above and press return to search.

యంగ్ హీరో షాకింగ్ ట్రాన్స్‌ఫార్మేష‌న్!

By:  Tupaki Desk   |   24 Jun 2022 2:30 PM GMT
యంగ్ హీరో షాకింగ్ ట్రాన్స్‌ఫార్మేష‌న్!
X
గ‌త కొంత కాలంగా సూప‌ర్ హిట్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు యంగ్ అండ్ వెర్స‌టైల్ హీరో శ‌ర్వానంద్‌. ఈ ఏడాది ప్రారంభంలో ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ 'ఆడ‌వాళ్లు మీకు జోహార్లు'. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీని కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించారు. మార్చిలో విడుద‌లైన ఈ మూవీ భారీ చిత్రాల కార‌ణంగా పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించలేక‌పోయింది. ఈ మూవీ త‌రువాత తెలుగు, త‌మిళ భాష‌లలో ద్విభాషా చిత్రంగా శ‌ర్వ చేస్తున్న మూవీ 'ఒకే ఒక జీవితం'.

శ్రీ‌కార్తిక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. 'ఆదిత్య 369' త‌ర‌హా టైమ్ ట్రావెల్ స్టోరీతో ఈ మూవీని డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. రీతు వ‌ర్మ హీరోయిన్. అక్కినేని అమ‌ల కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీని త్వ‌ర‌లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ మూవీపై శ‌ర్వా మంచి న‌మ్మ‌కంతో వున్నారు.

ఇదిలా వుంటే కొన్ని నెల‌ల క్రితం 'జాను' మూవీ షూటింగ్ సంద‌ర్భంగా ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆ త‌రువాత ఆ గాయం తిర‌గ‌తోడ‌టంతో అమెరికాలో ప్ర‌త్యేకంగా ఆప‌రేష‌న్ చేయించుకుని విశ్రాంతి తీసుకున్నారు. అప్ప‌టి నుంచి బ‌రువు పెరుగుతూ వ‌చ్చిన శ‌ర్వానంద్ 'ఆడ‌వాళ్లు మీకు జోహార్లు'లోనూ బ‌రువు పెరిగి క‌నిపించారు. అయితే తాజాగా యంగ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌చైత‌న్య మూవీ కోసం బ‌రువు తగ్గ‌డం విశేషం.

కృష్ణ‌చైత‌న్య ద‌ర్వ‌క‌త్వంలో శ‌ర్వానంద్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. చాలా ప్ర‌త్యేక‌త‌ల‌తో రూపొంద‌నున్న ఈ మూవీ కోసం శ‌ర్వా బ‌రువు త‌గ్గి షాకింగ్ ట్రాన్స్‌ఫార్మేష‌న్ తో క‌నిపిస్తున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. తాజాగా సాయి రాం శంక‌ర్ హీరోగా, య‌షా హీరోయిన్ గా న‌టిస్తున్న మూవీ 'వెయ్ ద‌రువెయ్‌'. శంక‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయితేజ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై దేవ‌రాజ్ పొత్తూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. న‌వీన్ రెడ్డి ద‌ర్శకత్వం వ‌హిస్తున్న ఈ మూవీ శుక్ర‌వారం హైద‌రాబాద్ లోని రామానాయుడు స్టూడ‌యోస్ లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హీరో శ‌ర్వానంద్ పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి హీరో, హీరోయిన్ సాయి రాంశంక‌ర్‌, య‌షాపై క్లాప్ నిచ్చారు. అల్ల‌రి న‌రేష్ కెమెరా స్విఛాన్ చేయ‌గా మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ఫ‌స్ట్ షాట్ కు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ ఫొటోల్లో బ‌రువు త‌గ్గి షాకింగ్ లుక్ లో క‌నిపిస్తున్న శ‌ర్వాని చూసిన వారంతా ఆశ్చ‌ర్యానికి లోన‌వుతున్నారు. ప్ర‌స్తుతం శ‌ర్వా ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.