Begin typing your search above and press return to search.

సిక్కోలుకు జ‌గ‌న్ పార్టీ రూ.కోటి సాయం..త‌మ్ముళ్లు చూశారా?

By:  Tupaki Desk   |   16 Oct 2018 9:29 AM GMT
సిక్కోలుకు జ‌గ‌న్ పార్టీ రూ.కోటి సాయం..త‌మ్ముళ్లు చూశారా?
X
తిత‌లీ తుఫానుతో అత‌లాకుత‌ల‌మైన సిక్కోలుకు అప‌న్న‌హ‌స్తం అందించేందుకు రాజ‌కీయాల‌కు అతీతంగా ఏపీ విప‌క్ష ఎంపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూ.కోటి ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించింది. దీనిపై హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సాధార‌ణంగా ఏదైనా ప్ర‌కృతి విప‌త్తు వ‌చ్చిన‌ప్పుడు అధికార‌పార్టీని విమ‌ర్శించ‌టం.. వారి త‌ప్పుల్ని ఎత్తి చూపించి చౌక‌బారు రాజ‌కీయాలు చేసే తీరుకు భిన్నంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హ‌రించింది.

విప‌త్తుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సిక్కోలుకు రూ.కోటి సాయం ప్ర‌క‌టించిన జ‌గ‌న్ పార్టీ తీరును ప‌లువురు అభినందిస్తున్నారు. రాజ‌కీయాల్ని ప‌క్క‌న పెట్టి విప‌త్తు వేళ‌.. రాజ‌కీయాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న తీరును ప్ర‌ద‌ర్శించిన విప‌క్ష నేత తీరును ప‌లువురు అభినందిస్తున్నారు.

ఆర్థిక సాయంతో విడిచిపెట్ట‌కుండా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు.. అభిమానులు స్వ‌యంగా రంగంలోకి దిగి బాధిత ప్ర‌జ‌ల‌కు ఆప‌న్న హ‌స్తం ఇవ్వ‌టం.. వారికి చేత‌నైనంత సాయాన్ని అందిస్తున్న వైనం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఏపీ అధికార‌ప‌క్షానికి చెందిన శ్రీ‌కాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు రియాక్ట్ అయ్యారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన కోటి రూపాయిల విరాళంపై ఆయ‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. తుఫాను బాధితుల కోసం విరాళం ప్ర‌క‌టించిన ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి త‌న హృద‌య‌పూర్వ‌క అభినంద‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రాజ‌కీయాల్ని ప‌క్క‌న పెట్టి.. తుఫాను బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకు రావాల‌న‌న మాట‌కు నిలువెత్తు రూపంగా జ‌గ‌న్ పార్టీ తీరును ఎంపీ ప్ర‌శంసించారు. మ‌రోవైపు.. సిక్కోలుకు సాయం ప్ర‌క‌టించిన ప‌లువురు వ్యాపార‌.. రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాతు.. సెల‌బ్రిటీల‌కు సైతం ఎంపీ పేరు పేరునా థ్యాంక్స్ చెప్పారు.