Begin typing your search above and press return to search.

ధృవ విలన్.. SJ సూర్య ఎసరు పెట్టేశాడు

అయితే నిజానికి ఈ క్యారెక్టర్ అరవింద్ స్వామి చేయాల్సిందంట. వెంకట్ ప్రభు ముందుగా 'మానాడు' కథని అరవింద్ స్వామిని నేరేట్ చేసాడంట.

By:  Tupaki Desk   |   20 Sep 2024 3:47 AM GMT
ధృవ విలన్.. SJ సూర్య ఎసరు పెట్టేశాడు
X

ధృవ సినిమాలో స్టైలిష్ విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న నటుడు అరవింద్ స్వామి. హీరోగా ‘రోజా’, ‘బొంబాయి’ లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించిన అరవింద్ స్వామి 2006 నుంచి 2013 వరకు మూవీస్ కి దూరంగా ఉన్నారు. తరువాత ‘కాదల్’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ తర్వాత 2015లో తమిళంలో జయం రవి హీరోగా తెరకెక్కిన ‘తని ఒరువన్’ సినిమాలో ప్రతినాయకుడిగా నటించారు.

ఈ సినిమాలో స్టైలిష్ విలన్ గా అరవింద్ స్వామి తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. 'తని ఒరువన్' తెలుగు రీమేక్ 'ధృవ'లో కూడా విలన్ క్యారెక్టర్ ని చేశారు. ఈ మూవీ తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. అక్కడి నుంచి గ్యాప్ లేకుండా అరవింద్ స్వామి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రలు అరవింద్ స్వామి ప్రస్తుతం పోషిస్తున్నారు..

పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అంటే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అయితే అరవింద్ స్వామి ఓ బ్లాక్ బస్టర్ హిట్ ని జస్ట్ లో మిస్ చేసుకున్నారంట. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు, ఎస్ జె సూర్య కాంబినేషన్ లో తెరకెక్కిన 'మానాడు' మూవీ తమిళంలో సెన్సేషన్ హిట్ అయ్యింది. టైం లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. ఇందులో ఎస్ జె సూర్య పెర్ఫార్మెన్స్ కి విమర్శకుల ప్రశంసలు లభించాయి.

అయితే నిజానికి ఈ క్యారెక్టర్ అరవింద్ స్వామి చేయాల్సిందంట. వెంకట్ ప్రభు ముందుగా 'మానాడు' కథని అరవింద్ స్వామిని నేరేట్ చేసాడంట. అందులో విలన్ క్యారెక్టర్ అరవింద్ స్వామికి బాగా నచ్చడంతో చేస్తానని చెప్పాడు. అయితే 'మానాడు' మూవీ స్టార్ట్ అయిన సమయంలోనే అరవింద్ స్వామి ఇంకో సినిమాకి కమిటై డేట్స్ కూడా ఇచ్చేసాడు. ఆ మూవీ కంప్లీట్ చేసుకొని తిరిగొచ్చేసరికి వెంకట్ ప్రభు ఎస్ జె సూర్యని ఆ క్యారెక్టర్ కోసం తీసుకొని షూటింగ్ కూడా మొదలుపెట్టారని టాక్.

ఈ క్యారెక్టర్ మిస్ కావడంతో అరవింద్ స్వామి బాధపడ్డారంట. అందుకే ఇప్పటి వరకు అతను 'మానాడు' సినిమా కూడా చూడలేదనే మాట వినిపిస్తోంది. 'మానాడు' అరవింద్ స్వామి మిస్ అవ్వడంతో వెంకట్ ప్రభు 'కస్టడీ' మూవీ కోసం అతన్ని ఎంపిక చేశారు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కాస్ట్ ఫెయిల్యూర్ అనే మాట వినిపించింది. 'కస్టడీ'లో విలన్ పాత్రలో అరవింద్ స్వామి బాగానే నటించారు. కానీ ఎందుకనో ఆయన బాడీ లాంగ్వేజ్ కి సైకో పాత్ర అస్సలు సెట్ కాలేదనే విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనా అరవింద్ స్వామి జస్ట్ మిస్ లో 'మానాడు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అయితే వేరే మూవీ కారణంగా కోల్పోయాడు.