Begin typing your search above and press return to search.

చై-శోభిత విడాకుల కామెంట్.. జ్యోతిష్యుడిపై పోలీస్ కేసు!

దీంతో సెల‌బ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఇరు సంఘాలు తెలిపాయి.

By:  Tupaki Desk   |   12 Aug 2024 3:00 AM GMT
చై-శోభిత విడాకుల కామెంట్.. జ్యోతిష్యుడిపై పోలీస్ కేసు!
X

శుభమా అంటూ నిశ్చితార్థం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న నాగ చైతన్య - శోభితా గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అ జంట విడిపోయే అవకాశం ఉందని జోశ్యం చెప్పిన సంగ‌తి తెలిసిందే. మరో మహిళ కారణంగా 2027లో ఈ జంట విడిపోతారని వేణు స్వామి తాజాగా జోస్యం చెప్ప‌డంతో వివాదం చెల‌రేగింది. ఇది అక్కినేని అభిమానులతో పాటు అందరికి కోపం తెప్పించింది.

స్వామి బోల్డ్ ప్రెడిక్షన్ (అంచ‌నా) తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) - తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TFDMA) చాల సీరియస్ గా తీసుకుంది. దీంతో సెల‌బ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఇరు సంఘాలు తెలిపాయి. వారు పోలీసులకు, మహిళా కమిషన్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు.

నాగ చైతన్య గతంలో నటి సమంతని వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట 2021 లో విడిపోయారు. అయితే శోభితా ధూళిపాళ ఇంతకు ముందు వివాహం చేసుకోలేదు. నాగ‌చైత‌న్య‌ను ఆమె పెళ్లాడుతున్నారు.

ఇదే స‌మ‌యంలో జ్యోతిష్కుడు వేణుస్వామి అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ కొత్త సీజ‌న్ లోకి ప్ర‌వేశిస్తార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ షోలో ప్ర‌వేశించేందుకు నాగార్జున అత‌డిని ప్రోత్స‌హిస్తారా? అంటూ ఒక వ‌ర్గం సందేహాలు వ్య‌క్తం చేస్తోంది. చైత‌న్య‌- శోభిత నిశ్చితార్థం త‌మ కుటుంబంలో ఆనందం నింపింద‌ని, త‌మ కుమారుడిలోను సంతోషం చూసామ‌ని నాగార్జున ప్ర‌ముఖ మీడియాతో వ్యాఖ్యానించారు. ఇలాంటి స‌మ‌యంలో వేణుస్వామి జోశ్యం పేరుతో తన నోటికి వచ్చింది చెబుతూ అక్కినేని అభిమానులకి ఆగ్రహం తెప్పించారు.